నన్ను రేప్ చేసి..బెదిరిస్తున్నాడని నటి ఫిర్యాదు..!

siri Madhukar
బాలీవుడ్ లో ఒకప్పుడు తన అందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టించిన హీరోయిన్ జీనత్ అమన్.  బాలీవుడ్‌ లో ‘సత్యం శివం సుందరం’, ‘కుర్బానీ’, ‘అజ్‌ నబీ’ వంటి సినిమాలతో జీనత్‌ స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు.  గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జీనత్ అమన్ ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు.  జీనత్‌ అమన్‌ ముంబయికి చెందిన వ్యాపారవేత్త అమర్ ఖాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమర్ ఖాన్ తనపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, గత కొద్ది రోజులుగా తన మొబైల్ కు అసభ్యకర ఫొటోలు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని జూహూ పోలీసులకు జీనత్ అమన్ ఫిర్యాదు చేశారు. అమన్ ఖన్నా(38) తన వెంటపడి వేధిస్తున్నాడని ఈ ఏడాది జనవరిలో కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అరెస్టయిన ఖన్నా తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఖన్నా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, ఒక ఆస్తి ఒప్పందం ఖరారు సాకుతో రూ.15.40 కోట్లకు మోసం చేశాడని నటి జీనత్ అమన్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.జీనత్ కుటుంబానికి అమర్‌ ఖాన్‌ కుటుంబంతో మంచి స్నేహం ఉంది. ఆర్థిక సంబంధమైన మనస్పర్థలతో ఈ రెండు కుటుంబాలు దూరమయ్యాయి. కొంత కాలంగా అమర్‌ సయోధ్యకు ప్రయత్నిస్తూ, ఆమెను ఇంటికి ఆహ్వానించడంతో స్పందించి వెళ్లారు.

ఆమె అతని ఇంటికి వెళ్లిన తరువాత నిజస్వరూపం ప్రదర్శించాడని ఆమె గతంలో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.   నటి జీనత్ అమన్ ఫిర్యాదు మేరకు నిందితుడు సర్ఫరాజ్ అలియాస్ అమన్ ఖన్నాను అరెస్టు చేసినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ కేసును క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించాం. దర్యాప్తు కొనసాగుతున్నది అని క్రైం డీసీపీ నిసార్ తంబోలి మీడియాకు వివరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: