‘రంగస్థలం’ లో ‘సవ్యసాచి’..!

siri Madhukar
ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా..మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా గురించే చర్చలు నడుస్తున్నాయి.  సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ , సమంత జంటగా నటిస్తున్న ‘రంగస్థలం’ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, పాటలు, ట్రైలర్ ఇలా అన్ని రకాలుగా రిలీజ్ చేసి సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించి ఒక్కో ప్రోమో రిలీజ్ చేస్తున్నారు.  నిన్న ఎంత సక్కగున్నావే..సాంగ్ రిలీజ్ చేశారు. 1985 నాటి గ్రామీణ వాతావరణాన్ని కళ్ల కట్టినట్టు చూపించారు..దాంతో సినిమా పై మరింత ఇంట్రెస్ట్ పెరిగిపోయింద. 

అంతే కాదు ఇప్పటి వరకు స్టైలిష్ గా ఉండే రాంచరణ్ గుబురు గడ్డం..లుంగితో అచ్చం పల్లెటూరి కుర్రాడిలా ఉన్నాడు. అంతే కాదు ఈ సినిమాలో చరణ్ పూర్తిగా చెవిటివాడి పాత్రలో నటిస్తున్నాడట.  ఇక సమంత విషయానికి వస్తే..ఇప్పటి వరకు ఎన్నో అందంగా కనిపించి ఈ అమ్మడు రామలక్ష్మిగా పల్లెటూరి అమ్మాయిగా నటిస్తుంది.  నిన్న రిలీజ్ అయిన ఎంత సక్కగున్నావే పాటలో చూస్తే అర్థం అవుతుంది. 

ఈ సినిమాలో ఆది, జగపతిబాబు, యాంకర్ అనసూయ నటిస్తున్నారు.  సంగీతం రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో  నాగచైతన్య 'సవ్యసాచి' సందడి చేయబోతున్నాడు.  అంటే సినిమాలో నటించి కాదండోయ్..ఈ నెల 30వ తేదీన విడుదలవుతోన్న 'రంగస్థలం' సినిమాకి ఈ టీజర్ ను జోడించనున్నారు.చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య 'సవ్యసాచి' చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. చివరి షెడ్యూల్ ఏప్రిల్ 12 నుంచి అమెరికాలో మొదలవుతుంది.

ఒకటి రెండు పాటలతో పాటు కొన్ని సన్నివేశాలను కూడా అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు.  భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో 'సవ్యసాచి' సినిమా ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించడం కోసం 'రంగస్థలం' సినిమాకి టీజర్ ను అటాచ్ చేస్తున్నారు.  ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, విలన్ గా మాధవన్ కనిపించనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: