అల్లు కాంపౌండ్ కు షాక్ ఇచ్చిన చిరంజీవి నిర్ణయం !

Seetha Sailaja
చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ని చరణ్ తన సొంత బ్యానర్ లో నిర్మించడంతో మెగా స్టార్ నటించే 151వ సినిమాను అల్లు అరవింద్ తన సొంత బ్యానర్ పై నిర్మించుదాం అనుకున్నాడు. అయితే ‘సైరా’ సినిమాను కూడ చరణ్ నిర్మిస్తున్న నేపధ్యంలో అరవింద్ చిరంజీవి నటించబోయే 152వ సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు.

అయితే ఆ ఆశలు కూడ గల్లంతు అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం చరణ్ కు ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మైత్రీ మూవీస్ సంస్థకు చిరంజీవి తన 152వ సినిమాకు సంబంధించి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు ఈన్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది. మైత్రీ మూవీస్ సంస్థ చిరంజీవిని తమ సినిమాలో నటించేవిధంగా ఒప్పించడానికి అత్యంత భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు టాక్. దీనికితోడు ‘రంగస్థలం’ మూవీని తీసే విషయంలో అదేవిధంగా ఆమూవీని ప్రమోట్ చేసే విషయంలో మైత్రీ మూవీస్ అనుసరించిన వ్యూహాలు చిరంజీవికి బాగా నచ్చినట్లు తెలుస్తోంది. 

అయితే ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ డేట్స్ తమ వద్ద ఉన్నప్పటికీ చిరంజీవి ‘సైరా’ ప్రాజెక్ట్ నుండి మరో 8నెలల వరకు బయటకు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో మైత్రీ మూవీస్ చిరంజీవితో మొదలు పెట్టవలసిన మూవీ ప్రాజెక్ట్ వచ్చే సంవత్సరం మాత్రమే మొదలు అవుతుంది అని అంటున్నారు. సుకుమార్ కథ వ్రాసుకునే విషయంలో చాల నెమ్మదిగా వ్యవహరిస్తాడు కాబట్టి ఈ సంవత్సరాంతానికి సుకుమార్ చిరంజీవి మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లు పూర్తి చేసిన తరువాత వచ్చే ఏడాది జనవరిలో ఈమూవీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. దీనితో మైత్రీ మూవీస్ వల్ల అల్లు అరవింద్ కు ఊహించని షాక్ తగిలింది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: