భరత్ పై ఆ ముగ్గురి భరోసా వెనుక ఆతర్యం !

Seetha Sailaja
ఈ వారం విడుదల కాబోతున్న ‘భరత్ అనే నేను’ మూవీ ఫలితం పై మహేష్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే ఈమూవీకి సంబంధించిన ముగ్గురు కీలక వ్యక్తులు ప్రదర్శిస్తున్న భరోసా వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో లోతైన చర్చలు జరుగుతున్నాయి. 

ఈసినిమాకు దర్శకత్వం వహించిన కొరటాల శివ ఈమూవీ బిజినెస్ విషయమై అన్నింటా తానై చక్రం తిప్పటమే కాకుండా ఈమూవీని భారీ మొత్తాలకు కొనుకున్న బయ్యర్లకు భరోసా ఇస్తూ రిజల్ట్ విషయంలో ఏదైనా తేడా వస్తే తాను ఆ నష్టాన్ని సద్దుబాటు చేస్తానని మాట ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా టాప్ డైరక్టర్ అయినప్పటికీ దర్శకుడు ఇలా బయ్యర్లకు ధైర్యం చెప్పిన సంఘటనలు గతంలో జరగలేదు అని అంటున్నారు. 

మహేష్ ‘స్పైడర్’ ఘోర పరాజయం చెందినా కొరటాల మాటలను నమ్మి ఈసినిమా పై 100 కోట్ల పెట్టుబడి బయ్యర్లు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ఈసినిమాను నిర్మించిన నిర్మాత దానయ్యకు చాల కార్పోరేట్ సంస్థలు తమ ప్రొడక్ట్స్ పబ్లిసిటీ కోసం ట్విన్ సిటీస్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ముఖ్యనగరాలలో వందలాది హోర్డింగ్ లు ఈమూవీకి సంబంధించి ఫ్రీగా అరేంజ్ చేస్తున్నారట. 

దీనివల్ల ‘భరత్’ ఫ్రీగా పబ్లిసిటీ రావడమే కాకుండా ఈ వ్యవహారాల వల్ల నిర్మాత దానయ్యకు 15 కోట్ల అదనపు లాభం వచ్చింది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా వరస పరాజయాలతో సతమతమవుతున్న మహేష్ కు కూడ ఈ సినిమా రిజల్ట్ గురించి ఏమాత్రం టెన్షన్ పడకుండా తన భార్య పిల్లలతో ప్రస్తుతం మహేష్ ప్యారిస్ లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉండటం మరింత ఆశ్చర్యంగా మారింది. దీనితో ‘భరత్’ కు సంబంధించి కీలక వ్యక్తులు అయిన ఈ ముగ్గురు ఇంత నమ్మకంతో ఉండటానికి ఆసినిమాలో అంత గొప్ప కంటెంట్ ఉందా ? లేదంటే ఈమూవీ బయ్యర్లు చివరి నిముషంలో టెన్షన్ పడి వారు ఇచ్చే డబ్బులో బేరసారాలు ఆడకుండా ఇలాంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నారా ? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: