నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి అందాల నటి సావిత్రి జీవిత నేపథ్యంతో తెరకెక్కించిన చిత్రం మహానటి. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, షాలిని పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకుడు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలెట్టేశారు.
అందులో భాగంగా ఇంతకుముందు వదిలిన ఒక లిరికల్ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దుల్కర్ సల్మాన్ .. కీర్తి సురేశ్ కాంబినేషన్లో వచ్చే ఆ సాంగ్ ను రిలీజ్ చేసిన ఈ సినిమా టీమ్, తాజాగా 'సదా నన్ను నడిపే నీ చెలిమే' అనే మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. మే 9న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.
ఒకవైపు చిత్రానికి సంబంధించిన పోస్టర్స్తో పాటు ఆడియో సాంగ్స్ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇక తాజాగా సదా నన్ను అంటూ సాగే పాటని విడుదల చేశారు. సమంత, విజయ్ దేవరకొండలతో పాటు దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్లపై చిత్రీకరించిన ఈ సాంగ్ పాత కాలాన్ని గుర్తు చేస్తుంది. మిక్కీ జే మేయర్ పాటకి స్వరాలు సమకూర్చగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు.
చారులత మణి పాట పాడారు. మొత్తానికి ఈ పాట ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేదిలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.పీరియాడిక్ బయోపిక్ గా రూపొందిన మహానటి చిత్రంలో సావిత్రి సినీ, వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాలను చూపించనున్నారు.