ఆ జ్ఞాపకాలు జీవితంలో మర్చిపోలేను : అనసూయ

Edari Rama Krishna
తెలుగు బుల్లితెరపై ‘జబర్ధస్త్’ కామెడీ షోతో పరిచయం అయిన యాంకర్ అనసూయ అతి తక్కువ కాలంలో మంచి పాపులారిటీ సంపాదించింది. హాట్ హాట్ గా డ్రెస్సింగ్ వేసుకొని..కవ్వించే మాటలతో..కుర్రాళ్లకు మత్తెక్కించేలా కనిపిస్తూ అనసూయ యాంకరింగ్ అందరినీ కట్టిపడేసేలా చేసేంది. దాంతో ఈ అమ్మడికి ఇతర ఛానల్స్ లో చాన్సులు రావడం..కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా చేస్తూ..బిజీగా మారిపోవడంతో జబర్ధస్త్ కి గుడ్ బాయ్ చెప్పింది.

అదే సమయంలో అక్కినేని నాగార్జున తో ‘సోగ్గాడే చిన్నినాయన’ ‘క్షణం’ చిత్రాల్లో చాన్సు రావడంతో ఇక వెండి తెరపై వెలిగిపోదానమనుకున్న అనసూయకు తర్వాత చాన్సులు ఏమీ రాలేదు. దాంతో మళ్లీ జబర్ధస్త్ కామెడీ షో లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.  అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తున్న అనసూయకు అదృష్టం కలిసి వచ్చింది. సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ లో రంగమ్మత్త పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. 

ఒకదశలో చిట్టిబాబు, రామలక్ష్మి పాత్రల తర్వాత అంతగా గుర్తింపు తెచ్చిన పాత్ర రంగమ్మత్త.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ ఈ చిత్రంలో తనకు చాన్స్ రావడం ఎంతో అదృష్టమని..తన కెరీర్ లో ఇదో మైలు రాయి అని అన్నారు. అంతే కాదు షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ..తన కో ఆర్టిస్టులు అందరూ చాలా బాగా సహకరించారని అన్నారు.

సుకుమార్ చాలా మంచి డైరెక్టర్ అని..రాంచరణ్, సమంత నటనకు ప్రాణం పోశారని అన్నారు.ఈ నేపథ్యంలో, అనసూయ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగ్ ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ, గత నెల సరిగ్గా ఇదే రోజు 'రంగస్థలం'కు సంబంధించిన మ్యాజిక్ ప్రపంచాన్ని చూపించామని తెలిపింది. షూటింగ్ నాటి కొన్ని మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటున్నానని చెప్పింది.
Exactly last month this day..the magic world of #Rangasthalam unveiled!!Sharing with y’all some memories we all can cherish❤️😌 Thank you everyone..this side and that side.. who made it all of this possible to this day😍 @MythriOfficial ❤️ @aryasukku 😍#teamRangasthalam 😍🤗 pic.twitter.com/oVvKmCwBBJ

— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 30, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: