టాలీవుడ్ లో కమిటి కూడా మ్యాచ్ ఫిక్స్..!

Prathap Kaluva

మీడియా ను బ్యాన్ చేయాలని టాలీవుడ్ కోడై కూసింది ఆ మాటకు వస్తే పవన్ కల్యాణే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా మీడియా ను బ్యాన్ చేయాలని పిలుపునిచ్చాడు. అయితే ఇప్పుడు మాత్రం ఆ ఊసే కనిపించడం లేదు. అస్సలు టాలీవుడ్ కమిటి ని ఎవరు ఫామ్ చేశారని సంగతి కూడా ఎవరికీ తెలియడం లేదు. ఇందులో ఎక్కువగా సురేష్ బాబు కు సంభందించిన మనుషులు ఉన్నారని తెలుస్తుంది. ఆక్టివ్ గా ఉండే ఆక్టర్స్ కనిపించడం లేదు. 


మీడియాతో తగాయిదా పడమని తాము చెప్పడం లేదని, అసలు మీడియా మీద కాలుదువ్వమని ఎవరు చెప్పారు? ఇప్పుడు బే షరుతుగా వెనక్కు తగ్గమని ఎవరు చెప్పారు? ఇంత జరిగాక ఇకపై భవిష్యత్ లో మీడియా గురించి ఇండస్ట్రీలో ఏ ఒక్కరైనా చిన్న మాట అనడానికైనా సాహసించగలరా? ఇక ఎప్పటికీ టాలీవుడ్ మీడియాకు ఒదిగి వుండాల్సిందే గా? అన్నక్వశ్చన్లు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.


ఇదిలా వుంటే టోటల్ ఎపిసోడ్ మొత్తం మెగా ఫ్యామిలీకి, లేదా ఇండస్ట్రీలోని ఒక వర్గానికే పరిమితం చేసే విధంగా మొత్తం వ్యవహారాన్నిమార్చేసారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎడిటర్ల సమావేశంలో చర్చించిన మేరకు ఓ క్వశ్చనీర్ ను తయారుచేసినట్లు తెలుస్తోంది. ఆ క్వశ్చనీర్ ను జర్నలిస్ట్ ల ప్రతినిధులు, ఇండస్ట్రీ ప్రతినిధుల ముందు వుంచినట్లు తెలుస్తోంది. ఆ క్వశ్చనీర్ ను చూస్తూనే ఇండస్ట్రీ ప్రతినిధులు మారు మాట్లాడలేకపోయారని బోగట్టా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: