మహేష్ తో ఎన్టీఆర్..ఏంటో ఆ సీక్రెట్ ముచ్చట!

Edari Rama Krishna
గత మూడు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ప్రోగ్రామ్ ‘జబర్ధస్త్’ కామెడీ షో.  ఈ ప్రోగ్రామ్ తో ఎంతో మంది ఔత్సాహికులు మంచి కమెడియన్లు గా ఎంట్రటైన్ మెంట్ చేస్తున్నారు.  ప్రస్తుతం ‘జబర్ధస్త్’ కామెడీ షో  నటించిన కమెడిన్లు వెండితెరపై చాన్స్ లు కొట్టేస్తున్నారు.  టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాని కమెడియన్ మహేష్ ‘జబర్ధస్త్’ తో మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి జబర్ధస్త్ మహేష్ పిలుస్తున్నారు.  సుకుమార్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. 

ఇప్పటికే రూ.200 కోట్లు కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్ చేస్తుంది.  ఈ సినిమాలో రాంచరణ్ అసిస్టెంట్ గా జబర్దస్త్ మహేష్ నటించిన విషయం తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాలో జబర్ధస్త్ లో నటించిన నటులు, యాంకర్ అనసూయ కు కూడా మంచి పేరు వచ్చింది.  ప్రస్తుతం జబర్దస్త్ మహేష్ ఎక్కడికెళ్లినా ప్రముఖ నటీనటులు అతన్ని పలకరిస్తూ ప్రశంసలు అందిస్తున్నారు. మహేష్ మహానటి లో కూడా ఒక మంచి పాత్ర చేశాడు. ఈ సినిమాలో జబర్ధస్త్ మహేష్ పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

నిన్న ‘మహానటి’ ఆడియో వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ మహేష్ బాగా సందడి చేశాడు. అదే విధంగా స్పెషల్ గెస్ట్ గా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మహేష్ ని పక్కన కుర్చోబెట్టుకొని మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతే కాదు ఎన్టీఆర్..  రంగస్థలంలో మహేష్ నటనను బాగా మెచ్చుకున్నారట.

అలాగే మహానటి పాత్ర గురించి మాట్లాడి త్వరలో మళ్లీ కలుద్దామని గుడ్ బాయ్ చెప్పేశారట. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది...ఎన్టీఆర్  కమెడియన్ మహేష్ తో అంతసీరియస్ గా ఏం మాట్లాడుతున్నాడో అంటూ నెటిజన్లు రక రకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమా ఈ నెల 9న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: