రాజకీయల్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు. మహానటులు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వారు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. బాలీవుడ్ నుంచి కూడా ఎంతో మంది నటులు కేంద్ర మంత్రులుగా కూడా వ్యవహరించారు. ఇక ఎన్నికల సందర్భంగా సినీతారల సందడి బాగా ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
ఈ నేపథ్యంలో అగ్రనేతలు ప్రధాని మోదీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహూల్ గాంధీ లు రంగంలోకి దిగారు. ఇప్పటికే యడ్యూరప్ప, సిద్దరామయ్య లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీల మద్య యుద్దం కొనసాగుతుంది. తాజాగా కర్ణాటక ఎలక్షన్ ప్రచారంలో హీరోలు, హీరోయిన్లు పాల్గొంటున్నారు. ఇప్పటికే జేడీఎస్ వాళ్లు కన్నడ ప్రముఖ హీరోయిన్ పూజాగాంధీ చేత ప్రచారం చేయించుకుంటున్నారు. కుమారస్వామిని మళ్లీ సీఎంగా చేయాలని అంటూ పూజాగాంధీ ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో చేరింది సంజన.
‘బుజ్జిగాడు’ సినిమాలో త్రిష చెల్లెలుగా నటించి తెలుగు వారికి సుపరిచితురాలీమె. ఆ సినిమాలోనే గాక మళ్లీ కూడా కొన్ని తెలుగు సినిమాల్లో చేసింది. సంజన కన్నడలో ఒక దశలో స్టార్ గా వెలుగొందింది. ఆ మద్య పవన్ కళ్యాన్ విషయంలో తెగ హల్ చల్ చేసిన సంజన ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్లలో ఎలాంటి ప్రభావం చూపించబోతుందో చూడాలి. ఓ వైపు కుమారస్వామిని మళ్లీ సీఎం చేమని పూజాగాంధీ పిలుపునిస్తుంటే, సిద్ధరామయ్యను మళ్లీ సీఎంగా చేయాలని సంజన అంటోంది.