మరో మైలురాయి చేరిన నా పేరు సూర్య..

Prathap Kaluva
కొణిదెల నాగబాబు సమర్పణలో స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్, ముద్దుగుమ్మ అను ఇమ్మానుయేల్ హీరో, హీరోయిన్లుగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. మొన్న విడుదలయిన ఈ చిత్రానికి బన్నీ అభిమానుల నుండి మాత్రమే గాక ప్రతి సినీ అభిమానుల నుండి మంచి స్పందన వస్తుంది. అల్లు అర్జున్ నటన చాలా బాగుందని సినీ ప్రముఖులు సైతం ట్విట్టర్లో స్పందిస్తున్నారు.


అనుకున్నట్టుగానే భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమా కలెక్షన్ల పరంగాను నిరాశపరచనేలేదు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలతో సంబంధం లేకుండా తమిళ, మలయాళం వంటి పరభాషా రాష్ట్రాలలోనూ బన్నీకి ఉన్న క్రేజ్ తో ఈ సినిమా కలెక్షన్ల జోరును కొనసాగిస్తోంది. ప్రారంభమయిన మొదటిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పదహారున్నర్ర కోట్ల షేర్, 23.72 కోట్లను రాబట్టి బన్నీ కెరీర్ లోనే దువ్వాడ జగన్నాథం సినిమా తర్వాత అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.


అయితే ఈ సినిమా మరో మైలురాయిని అందుకుంది. విడుదలయిన రెండురోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 63.86 కోట్ల గ్రాస్ ను సాధించి వందకోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులు తీస్తుంది. ఇప్పటికే రాంచరణ్ రంగస్థలం, మహేష్ భరత్ అను నేను రెండు 200 కోట్ల క్లబ్ లో చేరి పరుగులు తీస్తుండగా అంత పోటీని తట్టుకొని కూడా ఆలస్యంగా విడుదలయినప్పటికీ ఇంత రేంజిలో కలెక్షన్లను సాధించడం పట్ల ఆ చిత్ర యూనిట్ మరియు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: