పవన్ పై శ్రీరెడ్డి మరో పంచ్ వేసింది!

siri Madhukar
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తూ వస్తున్న శ్రీరెడ్డి ఏం మాట్లాడినా..ఏం చేసినా గత నెల రోజుల క్రితం సెన్సేషన్ గా ఉండేది.  ఫిలించాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో బాగాపాపులారిటీ తెచ్చుకుంది.  ఆనూహ్యంగా శ్రీరెడ్డికి మద్దతు పెరిగిపోయింది.  కాస్టింగ్ కౌచ్‌పై ఆమె పోరాటం అప్పట్లో అందరిని ఆకర్షించింది.  టీవీ ఛానెళ్లు కూడా ఆమెకు అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. ‘మా’కూడా దిగి వచ్చింది. 

తన పోరాటం తీవ్ర స్థాయిలోకి వస్తున్న సమయంలో ఉన్నట్టుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ తిట్టడంతో శ్రీరెడ్డి వ్యవహారంపై అందరూ భగ్గుమన్నారు. న్యూస్ ఛానెళ్లు పదే పదే ప్రసారం చేశాయో సీన్ మారిపోయింది. పవన్ ఆగ్రహం, తదనంతర కారణాలతో టీవీ ఛానెళ్లు ఆమెకు ముఖం చాటేశాయి. ఒకప్పుడు గంటల తరబడి డిబేట్లు పెట్టిన ఛానెళ్లే శ్రీరెడ్డికి నామ మాత్రంగా కవరేజీ ఇస్తున్నాయి. ఆమెకు మద్దతు కూడా ఆగిపోవడం మాత్రమే కాకుండా పవన్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 

దాంతో శ్రీరెడ్డి వారం రోజలు వరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంటి నుంచే సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ వచ్చింది. తాజాగా ఆమె మరోసారి జనసేనానిని టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టింది. కెమెరా గంగతో రాంబాబు సినిమాలో పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య మీడియా విషయమై వచ్చే సన్నివేశాన్ని శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.న్నివేశాన్ని శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. 

ఇంతటితో ఆగకుండా చిన్నదాన్నే కానీ ఫిడెల్ క్యాస్ట్రోనంటూ మరో పోస్ట్ చేసింది. అమెరికా లాంటి దేశాన్ని గడగడలాంచిన క్యూబా దివంగత నేతతో తనను తాను పోల్చుకోవడంలో శ్రీరెడ్డి పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్లిందా..లేదా మరేదైనా పోరాటానికి శ్రీకారం చుట్టబోతుందా అని అనుకుంటున్నారు. 

 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: