తారక్ ఆ ఒక్క హీరోయిన్ ను అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాడు..!

Prathap Kaluva

ఏదైనా సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయం లో హీరో పాత్ర కొంత మేర ఉంటుందని చెప్పవచ్చు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఉండదు ఎందుకంటే ఎవరైనా తప్పుగా అనుకుంటారని, ఎన్టీఆర్ కూడా ఎక్కువగా హీరోయిన్స్ విషయం లో అంతగా వేలు పెట్టడు. అయితే కాజల్ విషయం లో మాత్రం ఎన్టీఆర్ చాలా సార్లు రెఫెర్ చేసాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `అర‌వింద స‌మేత` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.


ఇందులో నాయిక‌గా పూజా హెగ్దే న‌టిస్తోంది. అయితే ఈసారి సినిమాలో త్రివిక్ర‌మ్ మాంచి ఊపున్న మసాలా సాంగ్ ను పెడుతున్నాడు. ఆ పాట‌లో క్రేజీ హీరోయిన్ న‌టిస్తే బాగుంటుంద‌ని తార‌క్ కు సూచించ‌గా వెంట‌నే కాజ‌ల్ అగ‌ర్వాల్ ను తీసుకుందామ‌ని స‌లహా ఇచ్చాడుట‌. హీరోగారి మాట కాద‌న‌లేక త్రివిక్ర‌మ్ కూడా ఒకే అన‌డం.. వెంట‌నే నిర్మాత‌ల‌తో క‌బురు పెట్ట‌డం డీల్ మాట్లాడం అన్నీ కుదిరాయ‌ని స‌మాచారం.


చాలా మంది హీరోయిన్లు ఉండ‌గా తార‌క్, కాజ‌ల్ పేరునే ఎందుకు సూచించాడంటే? వాళ్లిద్ద‌రు `బృందావ‌నం`, `బాద్ షా`, `టెంప‌ర్ ` సినిమాలో క‌లిసి న‌టించారు. అప్పుడే అమెతో స్నేహం ఏర్ప‌డింది. ఆ రిలేష‌న్ కాజ‌ల్ కు అవకాశాలు లేని స‌మ‌యంలో `జన‌తా గ్యారేజ్` లోనూ ఐటం పాట కోసం అమె పెట్టించాడు. అటు పై క‌ళ్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఎమ్మెల్యే` సినిమాలోనూ ఆమె హీరోయిన్ కావ‌డం విశేషం. మ‌ళ్లీ ఇప్పుడు కాజ‌ల్ ను తీసుకోవ‌డంతో వాళ్లిద్ద‌రి మ‌ధ్య స్నేహానికి మించి ఏదో ఉంద‌ని రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: