మహానటి పై మోజుకు కీర్తి సురేష్ షాకింగ్ ట్రీట్ మెంట్ !

Seetha Sailaja
‘మహానటి’ మూవీ సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ను ఎంచుకున్న తరువాత ఆమె ఆపాత్రకు న్యాయం చేయగలదా అన్నసందేహాలు చాలామందికి వచ్చాయి. అయితే ఆసందేహాలు అన్నింటిని మటుమాయం చేస్తూ సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించి అందరి ప్రశంసలు పొందుతున్న సందర్భంలో ఆమె ఒకప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మహానటి’ మూవీ మ్యానియా పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘మహానటి’ సినిమాను చూశాక ఇక ప్రేక్షకులు ఆమె నుంచి ఇలాంటి సినిమాలే ఆశిస్తారని రొటీన్ సినిమాలలో కీర్తిని అంగీకరించరని వస్తున్న కామెంట్స్ కు సమాధానంగా కీర్తి వ్యూహాత్మకంగా స్పందించింది. ‘మహానటి సక్సస్ తరువాత ఒక ప్రముఖ తమిళ నిర్మాణసంస్థ జయలలిత బయోపిక్ తీసే విషయంలో తనను సంప్రధించిన విషయాన్ని అంగీకరిస్తూ తాను ఇప్పట్లో ఏ బయోపిక్ లోను నటించను అని చెపుతూ తాను రొటీన్ సినిమాలకు రెడీ అన్న సంకేతాలు ఇచ్చింది. 

అంతేకాదు ‘మహానటి’ తర్వాత కేవలం తాను పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలే చేయాలనే ఆలోచన తనకు లేదని కమర్షియల్ సినిమాలు తాను హాయిగా చేస్తానని అయితే ఎక్స్ పోజింగ్ కు మాత్రం తాను ఖచ్చితంగా దూరం అంటూ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. గ్లామర్ గా కనిపించడం అంటే ఎక్స్ పోజింగ్ చేయడం కాదు అంటూ తనకు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలో తెలుసు అని అంటోంది. 

సాధారణంగా ఒకగొప్ప పాత్రలో ఒకనటి నటించాక అదే తరహా పాత్రలను దర్శక నిర్మాతలు ఆఫర్ చేస్తూ ఉంటారని అయితే తాను అలాంటి మ్యానియాలో పడబోనని స్పష్టమైన సంకేతాలు ఇస్తూ తాను గ్లామర్ గా ఎలా కనిపించాలో తనకు కొన్ని కిటుకులు తెలుసు అంటూ కీర్తి తాను కమర్షియల్ సినిమాలకు రెడీ అన్న సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో కీర్తి విక్రమ్ తో ‘సామి-2’ లో విజయ తో ఎ.ఆర్.మురుగదాస్ రూపొందిస్తున్న క్రేజీ ప్రాజెక్టులోనూ కీర్తి నటిస్తోంది. అయితే ‘మహానటి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించినా కీర్తి వైపు మన టాప్ హీరోలు ఎవ్వరు ఇప్పటి వరకు కీర్తి సురేశ్ వైపు చూడక పోవడంతో ‘మహానటి’ మ్యానియా కీర్తికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో శాపంగా మారిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: