ఒకే కథ పై రాజమౌళి ప్రభాస్ ల పోరాటం !

Seetha Sailaja
‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీలుగా మారిపోయిన రాజమౌళి ప్రభాస్ లు ఆతరువాత ఎవరిబాటలో వారు సినిమాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ కోసం ప్రభాస్ అబుదాబిలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కోసం కష్టపడుతున్న విషయం తెలిసిందే. తెలుస్తున్న సమాచారం మేరకు ‘సాహో’ కథ ఒక గ్యాంగ్ స్టర్ బేస్డ్ మూవీ అని వార్తలు వస్తున్నాయి. 

అనూహ్యంగా ఇదే కథ ఛాయలు రాజమౌళి త్వరలో ప్రారంభించ బోతున్న భారీ మల్టీ స్టారర్ లో కనిపిస్తాయని తెలుస్తోంది. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలోనే ఉండబోతోంది అని లీకులు వస్తున్నాయి. ఈమూవీలో ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ గాను రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గాను కనిపించబోతున్నారు. అయితే అనూహ్యంగా ఈ రెండు సినిమాలలోని కీలక సన్నివేశాలు కథనం ప్రముఖ హాలీవుడ్ మూవీ ‘గ్యాంగ్ స్టర్’ మూవీ నుండి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. 

హాలీవుడ్ ‘గ్యాంగ్ స్టర్’ మూవీ చూసిన వారికి ప్రభాస్ ప్రస్తుతం తీస్తున్న ‘సాహో’ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ఒకే కథను ఒకరికి తెలియకుండా ఒకరు అనుసరించారా అని సందేహాలు రావడం ఖాయం అని అంటున్నారు. అయితే రాజమౌళి సినిమాకు కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ ‘గ్యాంగ్ స్టర్’ మూవీలోని కేవలం ఒక పాయింట్ ను మాత్రమే తీసుకుని దానిని అన్నదమ్ముల కథగా మార్చి ఉంటాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 

దీనితో ప్రభాస్ రాజమౌళిల సినిమాలు ఒకే కథాంశంను ఎంచుకుని రూపొందింపబడుతూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈవార్తలే నిజం అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి ఈమూవీ కథలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఏమైనా ప్రభాస్ రాజమౌళీలు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే హాలీవుడ్ కథ పై మనసు పడటం షాకింగ్ గా మారింది..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: