హాట్ టాపిక్ గా మారిన వరుణ్ తేజ్ గ్రావిటీ రిస్క్ !

Seetha Sailaja
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. ‘ఘాజీ’ సినిమా తరువాత సంకల్ప్ రెడ్డి స్పేస్ థ్రిల్లర్ కథాంశంతో తీస్తున్న మూవీలో అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ విదేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి నటిస్తోంది. మరో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమూవీ కథ అంతరిక్ష పరిశోధన ఉంటున్న నేపథ్యంలో ఈచిత్రం కోసం జీరో గ్రావిటీ ఉండేలా హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో ఈ చిత్రం కోసం భారీ సెట్ నిర్మించారు.

ఈచిత్రం కోసం కొన్నినెలల పాటు వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడమే కాకుండా ఈసినిమా విషయంలో వరుణ్ తేజ్ చాల రిస్క్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రిస్కీ సన్నివేశాల్లో వరుణ్ తేజ్ డూప్ లేకుండా స్వయంగా నటిస్తూ ఉండటం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఈమూవీ షూటింగ్ తో పాటు ఈచిత్ర యూనిట్ తాము తీసే సన్నివేశాలకు 3డి స్కానింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ సమయంలో 3డి స్కానింగ్ ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు తెలుగులో సైన్స్ ఫిక్షన్ కథలను ఆధారంగా చేసుకుని వచ్చిన సినిమాలు లేవు. ఇలాంటి పరిస్థుతులలో సంకల్ప్ రెడ్డి ప్రతిభను నమ్ముకుని వరుణ్ తేజ్ చేస్తున్న ప్రయోగం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: