మామయ్య మాకు దేవుడు : సాయిధరమ్

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చారు.  అయితే ఒకే ఇంటి నుంచి అంత మంది హీరోలు వచ్చినా..ఎవరికి ఎవరూ కాంపిటీషన్ గా ఉండరు.  ఎవరి టాలెంట్ వారు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.  అల్లు అర్జున్, రాంచరణ్ ల తర్వాత సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు కూడా మంచి విజయాలతో దూసుకు వెళ్తున్నారు. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి మేనళ్లుడు సాయిధరమ్ నటించిన ‘తేజ్ ఐ లవ్ యూ’ ప్రి రిలీజ్ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఈ సందర్భంగా సాయిధరమ్ మాట్లాడుతూ..తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి తమలో నింపే స్ఫూర్తి అమూల్యమైందని హీరో సాయి ధరమ్ తేజ్ అన్నాడు. పొద్దున్నే లేచి చూసే ఫొటో తనదేనని చెప్పాడు.

ఆయన ఆశీర్వాదం తనపై ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు. గాస్టార్ తమను ప్రోత్సహించిన తీరు గురించి చెబుతూ ‘థాంక్స్ సో మచ్.. ఫర్ యువర్ ఇన్‌స్పిరేషన్ మామయ్య..’ అని తేజూ అన్నాడు. కార్యక్రమంలో తన అందంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మాట్లాడి అభిమానులను అలరించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: