‘బిగ్ బాస్ 2’సంజన పగ తీర్చుకుంది..!

Edari Rama Krishna
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ 2 ఇప్పుడిప్పుడే కాస్త గాడిన పడుతుందని అంటున్నారు.  ఈ సీజన్ లో పదహారు మంది సభ్యులు పాల్గొంటే..అందులో 13 మంది సెలబ్రెటీలు కాగా ముగ్గురు సామాన్యులకు చోటు ఇచ్చారు.  అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండటం..సెలబ్రెటీలు కూడా కాస్త పరిచయం ఉన్నవాళ్లు కావడంతో ఆ సీజన్ మొదటి నుంచి ఆసక్తిగా కొనసాగింది.  ఇక బిగ్ బాస్ 2 సీజన్ విషయానికి వస్తే..కొద్ది మంది మాత్రమే సెలబ్రెటీలు తెలిసినవారు కావడం..మిగిలిన వారిలో ముగ్గురు సామాన్యులు కావడంతో బిగినింగ్ నుంచి పెద్దగా ఆసక్తిగా నడవడం లేదని టాక్ వస్తుంది. 

అయితే వారం రోజులు తర్వాత ఎలిమినేషన్ విషయంలో కాస్త ఇంట్రెస్ట్ సీన్లు మొదలయ్యాయి.  ఇక సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మోడల్ సంజన మొదటి నుంచి కాస్త హడావుడి చేయడం మొదలు పెట్టింది.  వచ్చిన రోజే జైలుకి వెళ్లడం..దాదాపు రెండు రోజుల వరకు ఆమె అక్కడే ఉండటంతో ఆమె ఎంతో అసహనానికి గురైంది..ఇంటి సభ్యులు తనను కావాలనే ఇలా చేశారని..తాను హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తే..ఒక్కొక్కరి తాట తీస్తానని చెప్ప నానా హంగామా చేసింది. 

 ఇక హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా సంజన తన విశ్వరూపాన్ని చూపించింది.  తేజస్వితో పలుమార్లు గొడవలు పడటం ఇలా ఎన్నో సన్సేషన్స్ క్రియేట్ చేసింది.  దీంతో పాటు బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకుల నుంచి సంజనకు అతి తక్కువ ఓట్లు రావడం కూడా ఆమె ఎలిమినేషన్ కు మరో ప్రధాన కారణమైంది.

ఇదిలా ఉంటే..హౌస్ నుంచి బయటకు వచ్చే వేళ బాబు గోగినేని, తేజస్విలపై నిప్పులు చెరిగింది. గోగినేని బయటకు కనిపించేంత మంచి వ్యక్తి ఏమీ కాదని, తేజస్వికి పక్కవారితో ఎలా ఉండాలో తెలియదని వ్యాఖ్యానించింది. ఇక బయటకు వచ్చిన తరువాత తన చేతికి వచ్చిన బిగ్ బాంబ్ ను గోగినేనిపై ప్రయోగించిన తన పగ తీర్చుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: