రానా ఆరోగ్యం పై షాకింగ్ కథనాన్ని ప్రచురించిన జాతీయ మీడియా !

Seetha Sailaja
గత కొన్నిరోజులుగా రానా ఆరోగ్యం పై వస్తున్న వార్తలను అతడి తండ్రి సురేశ్ బాబు బహిరంగంగా ఖండించినా రానా ఆరోగ్యం పై ఒక షాకింగ్ కథనాన్ని ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ప్రచురించింది. రానా కుటుంబానికి సంబంధించిన సన్నిహితులు అందించిన లీకుల ప్రకారం తాము ఈవార్తను ప్రచురిస్తున్న విషయాన్ని ఆప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక తన వార్తా కథనంలో పేర్కొంది.

రానా వచ్చే వారంలో తన కిడ్ని ట్రాన్స్ ప్లెంటేషన్ కోసం అమెరికా కానీ సింగపూర్ కాని వెళ్ళడం ఖాయం అనీ అయితే అతడి విదేశీ ప్రయాణ వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతున్నట్లు ఆ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. అంతేకాదు రానాకు కిడ్నీని ఇవ్వబోతున్న డోనర్ రానా తల్లి శ్రీమతి లక్ష్మి అంటూ ఆకథనంలో పేర్కొంది. 

నాగచైతన్య తల్లి సురేశ్ బాబు చెల్లెలు పేరు కూడ లక్ష్మి అయిన నేపధ్యంలో ఆమె పేరు కూడ రానాకు కిడ్నీ డోనర్ గా వినిపిస్తోంది అంటూ మరొక ఊహాగానానికి తెర తీసింది ఆ ఆంగ్ల పత్రిక. అంతేకాదు రానాకు వచ్చిన ఈ కిడ్నీ సమస్య ‘బాహుబలి’ కోసం రానా విపరీతమైన బరువు పెరగడం వలన కాదనీ రానాకు వంశ పారంపర్యంగా వచ్చిన లక్షణం ఇది అని వైద్యులు అభిప్రాయ పడుతున్నట్లు ఆ ఆంగ్ల పత్రిక షాకింగ్ కథనాన్ని ప్రచురించింది.

అయితే రానా రేపటి నుంచి ఒక సినిమా షూటింగ్ లో పాల్గోనబోతూ ఉండటంతో పాటు తాను ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘యారి నెంబర్ వన్’ మేకర్స్ ను తమ షూటింగ్ ను అత్యంత వేగవంతంగా పూర్తి చేసుకోమని సూచనలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో రానా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలతో మీడియా హోరెత్తిపోతోంది. ఇప్పటికే ఈవార్తల పై ఖండన వస్తూ ఉన్నా ఏదోఒక కారణం లేకుండా ఇలాంటి వార్తలను జాతీయమీడియా ప్రచురించదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: