షాకింగ్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే పవన్ వీరాభిమాని ఓ పబ్లిక్ ప్రోగ్రాంలో జై జగన్ అన్నాడు..!

KSK
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ఆడియన్స్ కి  కెంతో సుపరిచితుడు షకలక శంకర్. ఈ కామెడీ షో ద్వారా తనలో ఉన్న టాలెంట్ నీ చూసిన ప్రముఖులు సినిమాల్లోకి అవకాశాలు ఇవ్వడం జరిగింది. తాజాగా ఇటీవల మనోడి నటించిన శంభో శంకర అనే సినిమా కూడా విడుదల అవడం జరిగింది.

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించే ఆలీ తో సరదాగా అనే కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యాడు షకలక శంకర్.  మాములుగానే శంక‌ర్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ అభిమాని అన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌ని దేవుడిలా భావిస్తాడు శంక‌ర్.

మ‌రి అలాంటి శంక‌ర్ ఈ టీవీ ప్రొగ్రామ్‌లో జైజ‌గ‌న్ అన‌డం అంద‌రికి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. జైజ‌గ‌న్ అనే మాట‌ను మ్యూట్ చేసిన‌ప్ప‌టికి ఆ ప‌దం అంద‌రికి అర్థం అవుతుంది. జ‌బ‌ర్థ‌స్త్ వాళ్లు ప‌వ‌న్ జ‌పం చేస్తు కాలం గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రి ష‌క‌లక శంక‌ర్ జైజ‌గ‌న్ అన‌డంపై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరోపక్క షకలక శంకర్ చేసిన కామెంట్స్ తెలుగు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: