తన నీచత్వాన్ని బయటపెట్టుకున్న జగపతిబాబు !

Seetha Sailaja
ఫ్యామిలీ హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు ఆ తరువాత మహిళలు సినిమాలు చూడటం మానివేసి బుల్లితెరకు అతుక్కు పోవడంతో ఆతరువాత కాలంలో జగపతిబాబు హీరో కెరియర్ పరిసమాప్తం అయిపోయింది. అయితే అనుకోకుండా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ సూపర్ సక్సెస్స్ అవడంతో జగపతిబాబు ప్రస్తుతం విలన్ గా చాల బిజీగా ఉంటూ దక్షిణాది భాషలకు చెందిన అన్ని సినిమాలలో నటిస్తూ అత్యంత భారీ పారితోషికాన్ని  అందుకుంటున్నాడు. 

ఇలాంటి పరిస్థితులలో జగపతిబాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలనిజానికి పర్ఫెక్ట్ నిర్వచనం చెబుతూ తాను లేటెస్ట్ గా ‘సాక్ష్యం’ సినిమాలో తాను చేసిన పాత్రను చూస్తే జనాలు తనను కొట్టడం ఖాయం అని అంటున్నాడు. ఈపాత్ర తాను చేస్తున్నప్పుడు తనంత నీచుడు ఎవడూలేడని ఎవరైనా అనుకునితీరుతారు అని చెపుతూ ‘సాక్ష్యం’ సినిమాలోని తన పాత్ర పై అంచనాలు పెంచుతున్నాడు. 

ఇదే సందర్భంలో జగపతిబాబు మాట్లాడుతూ ‘సాక్ష్యం’ లో తాను చేసిన విలనిజమ్  చూసి ఎవరు తనను క్షమించరు అని అంటూ ఇప్పటివరకు తన విలన్ పాత్రలను ప్రేక్షకులు ఆదరించినా ఈసారి కష్టం అంటూ   తాను ‘సాక్ష్యం’ సినిమాలో పరమ ‘ఎధవ’ గా కనిపించపోతున్న సంకేతాలు ఇస్తున్నాడు. ఇలాంటి పాత్రలు చేస్తే తన మీద తనకే భయం వేస్తోందని తన  రొటీన్ లైఫ్ లో కూడా తను ఇలా మారిపోతానేమో అన్నభయం తనను వెంటాడుతోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.  

‘లెజెండ్’ సినిమాలో విలన్ పాత్రకు ఇగో ఉంటుంది. అలాగే ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో క్లాసీ విలనిజం కనపడుతుంది ‘జయజానకీ నాయక’ లో విలన్ కు పరువు పిచ్చి ఉంటుంది అంటూ ఇలా ఇన్నాళ్లు తాను   చేసిన విలన్ పాత్రలకు ఒక సందర్భం ఉన్నా కేవలం డబ్బు పిచ్చితో   పరమ ఎధవగా ‘సాక్షయం’ సినిమాలో కనిపించబోతున్న విషయాన్ని బయటపెట్టాడు జగపతిబాబు. ఒకప్పుడు స్క్రీన్ పై తాను చాలా సాఫ్ట్ అని అంటూ ఇలాంటి విలన్ పాత్రలు వేస్తానని తాను అనుకోలేదని  ఆసినిమాలు తన కర్మ కాలి హిట్ అయ్యాయి అంటూ తన జీవిత ప్రయాణం ఎక్కడివరకో తనకే తెలియడం లేదు అంటూ తన జీవితంలో జరుగుతున్న మార్పుల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఏది ఏమైనా జగపతిబాబు వైరాగ్యం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: