కత్తి నువ్ గలీజోడివి..అందరూ అలా అనుకుంటే ఎలా!

Edari Rama Krishna
బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కత్తి మహేష్ కాస్త ముందడుగు వేసి పవన్ స్టార్ పవన్ కళ్యాన్ తో గొడవ పెట్టుకున్నాడు.  దాంతో దాదాపు నాలుగు నెలల వరకు పవన్ ఫ్యాన్స్ వర్సెస్ కత్తి మహేష్ కి మద్య పెద్ద యుద్దమే కొనసాగింది.  ఈ గొడవ కాస్త సర్దుమనిగే సమయంలో నటి శ్రీరెడ్డి విషయంలో కాస్టింగ్ కౌచ్ పై జోక్యం చేసుకొని మరి కొన్ని రోజులు తన ఉనికి చాటుకుంటూ వస్తున్నాడు కత్తి మహేష్.  తాజాగా భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎంతో భక్తి శ్రద్దలతో కొలిచే సీతా, రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించాడు. 

హిందువుల మనోభావాలు దెబ్బతినడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.  ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. స్వామి పరిపూర్ణానంద, నటుడు నాగ బాబు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సహా కొందరు నటులు ఆయనన తీరును తప్పుపడుతూ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత  మాట్లాడుతూ..త్తి మహేష్ నోటికొచ్చినట్లు శ్రీరాముడిని కించపరచడం అంటే మొత్తం హిందువులను, వారి భావాలను కించపరచడమే అని అన్నారు.

అదే వేరొక మతం అయితే వారు ఈ పాటికి ఆయనకి చాలా గట్టిగా బుద్ధికి చెప్పేవారని..హిందువుల శాంత మూర్తులు కనుకనే అయన్ని క్షమించారని అన్నారు. కత్తి మహేష్ గారి భార్య ఆయన్ని విడిచి వెళ్ళిపోయాక అయన వేరే వాళ్ళతో ఆనందంగా ఉండడం వల్లనే సాక్ష్యాత్తు సీతమ్మ వారిని ఆ విధంగా భావించి ఆలా అని ఉంటాడని మండిపడ్డారు.

తాను గలీజు పనులు చేస్తూ..తన చుట్టూ అలాగే ఉంటుందన్న నీచమైన ఆలోచనలో కత్తి ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తన తప్పుడు వ్యవహారాలు అందరికి ఆపాదించడం ఎంతవరకు సబబని, అదికూడా భావగవత్ స్వరూపుడైన రాములవారిని, సీతమ్మను అవమానించేలా ఆపాదించడం క్షమించరాని నేరమని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి మంచి నిర్ణయం తీసుకుందని, భవిష్యత్తులో ఇటువంటివారికి మరింత కఠిన రీతిన శిక్షలు అమలు చేయాలనీ ఆమె కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: