మూసుకుపోతున్న ఆప్షన్స్ - అంతర్మధనంలో తేజ్ !

Seetha Sailaja
మెగా మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదట్లో విజయాలు అందుకున్న ఈ యంగ్ హీరోకు ప్రస్తుతం అతడి సినిమాలకు సంబంధించి డిజాస్టర్స్ లో డబల్ హ్యాట్రిక్ పూర్తి అవ్వడంతో ప్రస్తుతం ఈ యంగ్ హీరో పరిస్థితి అత్యంత అయోమయంగా మారింది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా విడుదలైన ఇతడి ‘తేజ్ ఐ లవ్యూ’ మూవీ కూడ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు ఈ మూవీ పై పూర్తిగా ఆశలు వొదులుకున్నారు.

ఈ మూవీని తేజ్ ఎంత ప్రమోట్ చేసినా కనీసపు కలక్షన్స్ కూడ రాకపోవడంతో ఈ యంగ్ హీరోని అంతర్మధనంలో పడేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడిన నేపధ్యంలో ఆరుసినిమాలు వరసగా ఫెయిల్ అయ్యాక ఏ హీరోకైనా మనుగడ అంత సులువు కాదు. అయితే గతంలో అతడు చేసిన సినిమాలు కొన్ని విజయం సాధించడంతో పాటు మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వల్ల ఇంకా సాయి ధరమ్ తేజ్ కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 

ముఖ్యంగా ప్రస్తుతం టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్న మైత్రీ మూవీస్ తేజ్ తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ మూవీకి దర్శకుడుగా కిషోర్ తిరుమలను ఎంపిక చేయడం తేజ్ కు పూర్తిగా ఇష్టం లేదు అని అంటున్నారు. దీనికి కారణం ఇతడు దర్శకత్వం వహించిన రెండు సినిమాల్లో అతడి డెబ్యూ మూవీ ‘నేను శైలజ’ హిట్ అయినప్పటికీ రెండవ సినిమాగా వచ్చిన రామ్ హీరోగా నటించిన ‘జిందగీ’ ఫెయిల్ అవ్వడంతో ప్రస్తుతం దర్శకుడు కిషోర్ తిరుమలకు క్రేజ్ లేదు. 

ఇలాంటి పరిస్థుతులలో ఒక ఫెయిల్యూర్ దర్శకుడుతో సినిమా చేయడం తేజ్ కు ఇష్టం లేకపోయినా ప్రస్తుతం టాప్ దర్శకులు ఎవరు అతడి వైపు చూడని పరిస్థుతులలో తేజ్ కు ఇతడితో మూవీ చేయడం తప్ప మరొక మార్గం లేదు అని అంటున్నారు. తన సినిమాలకు సంబంధించి కథలు ఎంచుకోవడంలో అనేక పొరపాట్లు చేస్తున్న తేజ్ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోకపోతే రానున్న రోజులలో ఈ తీవ్రపోటీ మధ్య ఈయంగ్ హీరో నిలబడటం కష్టం అన్న కామెంట్స్ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: