నా భార్య ఫోన్ చేయగానే షాక్ తిన్నాను! : ఎన్టీఆర్
తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత వెంటనే రాజమౌళి చిత్రంలో నటించబోతున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇదిలా ఉంటే నిన్న సెలెక్ట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే..ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పి షాక్ ఇచ్చారు.
తాను రభస చిత్రం షూటింగ్ కోసం స్వట్జర్లాండ్ కి వెళ్లామని..ఆ సమయంలో నా భార్య నిండు గర్భవతి అన్నారు. అయితే తనకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే ఫోన్ చేయ్..వెంటనే వచ్చేస్తానని ధైర్యం చెప్పి వెళ్లాను. ఒకరోజు షూటింగ్ గ్యాప్లో మా ఆవిడతో మాట్లాడుతుంటే తన వాయిస్ లో ఏదే తేడా వినిపించింది. వెంటనే నిన్ను నేను చంపేస్తాను. నేనిక్కడ ఉన్నాను. నువ్వు అప్పుడే కనేయకు నేనొచ్చేవరకూ ఆగు అన్నాను. షూటింగ్ మద్యలో ఆపేసి వెంటనే ఇక్కడికి ఉదయం ల్యాండ్ అయ్యాను. ఇంటికి వెళ్తున్న సమయంలో నాకు ఫోన్ వచ్చింది..ఎక్కడున్నావ్ అంటే..హాస్పిటల్ వెళ్తున్నా అని చెప్పడంతో నా గుండె ఆగినంత పనైంది.
ఏమైంది అనగానే చిన్న చెకప్ అని చెప్పింది..ఆ సమయంలో మా ఆవితో మా అమ్మగారు ఉన్నారు. ఒకే నువ్వు వెళ్లు నే ఇంటికి వెళ్లి వస్తానని చెప్పా. నేను ఇంటికెళ్లి కాఫీ తాగుతుంటే మా అమ్మ ఫోన్ చేయగానే గుండె ఆగిపోయింది. పరిస్థితి అర్థమై . వెంటనే బయల్దేరి వెళ్లాను అప్పుడే మా పెద్దబ్బాయి పుట్టాడు. కొంచెం ఏమాత్రం లేటయినా ఆ సమయానికి నేను లేకపోయేవాడిని. అదంతా ఫోన్ కారణంగానే అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.