చైతు సమంతల మధ్య సమస్యగా మారిన ఆ అమ్మాయి !

Seetha Sailaja
‘ఏ మాయ చేసావే’ సినిమాలో ప్రేమ జంటగా నటించి నిజమైన ప్రేమికులుగా మారి ఆతరువాత భార్య భర్తలుగా మారిన చైతూ సమంతల జంట పై విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ కొన్ని ప్రముఖ వ్యాపార సంస్థలు చైతన్యా సమంతలతో యాడ్స్ చేస్తున్నాయి అంటే వీరిపట్ల తెలుగువారిలో ఎంత క్రేజ్ ఉందో
అర్ధం అవుతుంది.

ప్రస్తుతం చైతన్యా సమంతలు తాము నటిస్తున్న వేరువేరు సినిమాలతో బిజీగా ఉన్నా త్వరలో వీరిద్దరూ కలిసి నటించబోతున్న మూవీ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని చైతన్య లీక్ చేసాడు. ‘నిన్నుకోరి’ మూవీతో మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కాబోతున్న ఈమూవీలో అప్పటికే పెళ్లి అయిన జంటగా చైతన్యా సమంతలు నటించబోతున్నారు.  

ఈసినిమా కథలో వచ్చే ట్విస్ట్ లో ఒక అమ్మాయి పాత్ర ప్రవేసించి తమ భార్య భర్తల మధ్య చిచ్చు పెడుతుందని నిజ జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న తాము ఆసినిమాలో ఒక అమ్మాయి కోసం విడిపోయే భార్యాభర్తలుగా నటించబోతున్నట్లు లీకులు ఇస్తున్నాడు చైతన్య. ‘నిన్నుకోరి’ సినిమాలో వివాహ బంధం ప్రేమకంటే చాల విలువైనది అని సందేశం ఇచ్చిన శివ నిర్వాణ ఈకథలో మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు.

మరో రెండు మూడు నెలలలో ప్రారంభం కాబోతున్న ఈమూవీలో చైతన్య సమంతల మధ్య చిచ్చు పెట్టే సమర్ధతగల కొత్త అమ్మాయి కోసం ఇప్పుడు అన్వేషణ జరుగుతున్నట్లు టాక్. చైతూ సమంతల క్రేజ్ పై నమ్మకం పెట్టుకుని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈమూవీ పై ఇంకా ప్రారంభం కాకుండానే భారీ అంచనాలు ఉన్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: