తెలుగు ఇండస్ట్రీలో సరైనోడు చిత్రంతో విలన్ గా యూటర్న్ తీసుకున్న హీరో ఆది పినిశెట్టి. ఆ తర్వాత రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో చరణ్ అన్నగా నటించి మెప్పించాడు. తాజాగా ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ప్రధాన పాత్రల్లో తెరకెక్కెతున్న మూవీ ‘నీవెవరో’. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. హరినాధ్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు.. ఈ మూవీలో ఆది అంధుడిగా కనిపించనున్నాడు.
ఇక ఈ మూవీ కన్నడ మూవీ అదే కంగల్ కు రీమేక్. ఒరిజినల్ వెర్షన్లో కలైయారసన్ హరికృష్ణనన్ కనిపించిన పాత్రలో ఆది నటించనున్నాడట. ఇదే కథతో తెలుగు, తమిళ భాషల్లో నీవెవరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. హరనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. లవ్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. రీజెంట్ గా ఈ మూవీ లోని ఓ చెలి సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. ఈ సాంగ్ ను ఆది, తాప్సీ, రితీకా సింగ్ ల మధ్య చిత్రీకరించారు.
గతంలో ఈ తరహా సినిమాల్లో నటించిన అనుభవం ఆది పినిశెట్టితో పాటు తాప్సీ .. రితికా సింగ్ లకు వుంది. కోన వెంకట్ సమర్పిస్తోన్న ఈ సినిమా, అనూహ్యమైన మలుపులతో సాగుతుందని అంటున్నారు. ప్రధానమైన మూడు పాత్రలను చాలా వైవిధ్యభరితంగా తీర్చిదిద్దారట. ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ లోనే మంచి కంటెంట్ వున్న సినిమాలు వచ్చి భారీ విజయాలను అందుకున్నాయి. అలాగే ఈ సినిమా కూడా మంచి వసూళ్లను రాబడుతుందేమో చూడాలి.