ఇండస్ట్రీకి షాకింగ్ గా మారిన నాగశౌర్య ఇగో !

Seetha Sailaja
టాలీవుడ్ క్రేజీ హీరోలలో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్న నాగశౌర్య కెరియర్ లో ఎన్నో ఒడుదుడుకులు ఉండటంతో ఇప్పటికీ ఈ యాంగ్ హీరో పూర్తిగా స్థిరపడలేక పోతున్నాడు. అయితే ఈసంవత్సరం ఆరంభంలో వచ్చిన ‘ఛలో’ విజయవంతం కావడంతో ఈ హీరో ఆలోచనలు అన్నీ మారిపోయాయి. ఈమూవీని నాగశౌర్య కుటుంబ సభ్యులు నిర్మించడంతో తాను నటించే సినిమాలకు సొంత నిర్మాణ సంస్థ అయితేనే మంచిది అన్న అభిప్రాయంలో ఈయాంగ్ హీరో ఉన్నాడు. 

సుమారు 5కోట్ల బడ్జెట్ తో తీసిన ‘ఛలో’ కు రెట్టింపు కలక్షన్స్ వచ్చాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఈ సక్సస్ ఇచ్చిన ఆనందంతో నాగశౌర్య ఇప్పుడు తన తల్లిని నిర్మాతగా చేసి తన సొంత నిర్మాణ సంస్థలోనే ‘నర్తనశాల’ నిర్మిస్తున్నాడు. ఈమూవీలో నాగశౌర్య స్త్రీ లక్షణాలు ఎక్కువగా ఉన్న పురుష పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ పై అంచనాలు బాగా ఉండటంతో ఈ నెలాఖరున ఏకంగా నాగచైతన్య ‘శైలజా రెడ్డి’ ని టార్గెట్ చేస్తూ పోటీగా విడుదల చేస్తున్నాడు.

ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ నాగశౌర్య ఈమూవీ పై 15కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టినట్లు స్వయంగా చెప్పడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటి వరకు ఈయంగ్ హీరో నటించిన ఏసినిమాకు 10కోట్లు దాటి కలక్షన్స్ రాని పరిస్థుతులలో ఏధైర్యం చూసుకుని ఈయంగ్ హీరో తన సినిమా పై 15 కోట్లు ఖర్చు పెట్టాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. 

ఇదే ఏడాది విడుదలైన ‘కణం’ ‘అమ్మమ్మగారిల్లు’ సూపర్ ఫ్లాప్ లుగా నిలిచినా నేపధ్యంలో గ్యారెంటీ లేని ఈహీరో పై 15 కోట్లు పెట్టడం ఎంత పెద్ద రిస్క్ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ‘ఛలో’ సక్సెస్ ను చూసుకుని మితిమీరిన నమ్మకంతో ఇలా ఇగో తో నాగశౌర్య ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడు అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: