సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరో, హీరోయిన్లు తాము రిజక్ట్ చేసిన సినిమా ఘన విజయం సాధించి వాళ్లకు సవాల్ విసురుతుంటాయి. ఆ తర్వాత అయ్యో అంత మంచి హిట్ సినిమాలో మేం నటించలేదని పశ్చాతాప పడుతుంటారు. ఆ సమయంలో దర్శకుడిపై, బ్యానర్ పై నమ్మకం లేకనో..షెడ్యూల్స్ సెట్ కాకనో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా..ఆ సినిమా హిట్, ఫ్లాప్ ల గురించి తర్వాత కామెంట్ చేయడం సర్వసాధారణం అయ్యింది. రీసెంట్ గా రిలీజ్ అయిన శ్రీనివాస కళ్యాణం వాస్తవానికి ఎన్టీఆర్ చేయాల్సి ఉన్నా బిజీ షెడ్యూల్ వల్ల చేయలేక పోయాడు..దాంతో ఓ ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు.
తాజాగా ఈ సినిమాలో నటించిన రాశీఖన్నా 'గీత గోవిందం' ఛాన్స్ మిస్ అయి తెగ బాధపడుతుందట. 'గీత గోవిందం' సినిమాకి ముందుగా లావణ్య త్రిపాఠిని అనుకున్నారట. కానీ రాశిఖన్నా అయితే కరెక్టుగా ఉంటుందని భావించి ఆమెను సంప్రదించారు. ఈ సినిమాకు కోటి రూపాయల పారితోషికం అడగడంలో నిర్మాతలు వెనక్కి తగ్గారట.
కాస్త తగ్గించుకోమంటూ చెప్పినా ప్రయోజనం లేకుండా పోవడంతో, రష్మిక మందనను తీసుకున్నారు. అదే సమయంలో పెద్ద బ్యానర్ లో శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించింది. కానీ అది ఫ్లాప్ అయ్యింది..తాను మిస్ చేసుకున్న గీతాగోవిందం హిట్ అయ్యింది. ఈ విషయంలో పాపం రాశి ఖన్నా బాగానే ఫీల్ అవుతోందట.