గంటెందుకు రా..అరగంటలోనే వెళ్తాం..కైలాసానికి!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి.  వెంకటేష్,వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఒక చిత్రం, నాగార్జున, నాని కాంబినేషన్ లో మరో చిత్రం, రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ రాజమౌళి అద్భుతమైన మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కబోతుంది.  తాజాగా ఇప్పుడు టాలీవుడ్ కామెడీ హీరోలుగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్ లో ‘సిల్లీ ఫెల్లోస్’చిత్రం వస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి సుడిగాడు దర్శకుడు భీమినేని శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.  సెప్టెంబర్ 7న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని టీం భావిస్తుండ‌గా, మేక‌ర్స్ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్ తో పాటు అల్లరి నరేష్, సునీల్ ల ఫన్నీ డైలాగ్స్ నవ్వులు పుయిస్తున్నాయి. ‘ఇలాగైతే గంటలో శ్రీశైలం వెళిపోతాం కదరా..అంటూ అల్లరి నరేష్ అంటుంటే..గంటెందుకు రా అరగంటలోనే వెళ్తాం..కైలాసానికి సునీల్ కొట్టే డైలాగ్ చూస్తుంటే..ఈ చిత్రం ఏ రేంజ్ లో కామెడీ ఉంటుందో ఊహించుకోవొచ్చు.  కొన్నాళ్ళుగా స‌రైన హిట్స్ లేని హీరోలు సునీల్‌, అల్ల‌రి న‌రేష్ ఈ ప్రాజెక్ట్‌పై భారీ హోప్స్ పెట్టుకున్నారు.

చిత్రంలో కథానాయికలుగా పూర్ణ, చిత్ర శుక్లాలు న‌టిస్తున్నారు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గతంలో అల్లరి నరేశ్ .. సునీల్ కాంబినేషన్లో 'తొట్టి గ్యాంగ్' చిత్రంలో నటించారు.  ట్విస్ట్ ఏంటంటే..ఈ చిత్రంలో హీరో అల్లరి నరేష్ అయితే..కమెడియన్ గా నటిస్తున్నారు సునీల్.  ప్ర‌స్తుతం సునీల్ హీరోగానే కాక క‌మెడీయ‌న్‌గా ప‌లు సినిమాల‌లో న‌టిస్తున్నాడు. ఇక వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు అల్లరి నరేష్. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: