జూనియర్ నిర్ణయం పై త్రివిక్రమ్ గందరగోళం !

Seetha Sailaja
నందమూరి హరికృష్ణ మరణం జూనియర్ ఎన్టీఆర్ కు తీవ్ర బాధను మిగల్చడంతో ఆ షాక్ నుండి జూనియర్ వెంటనే తేరుకుంటాడా లేదంటే కొంత సమయం తీసుకుంటాడా అన్న కోణంలో ప్రస్తుతుం త్రివిక్రమ్ గందరగోళంలో పడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి హరికృష్ణ మరణం తరువాత జరిపే కార్యక్రమాలు కనీసం మరో కొన్నిరోజులు జరుగుతాయి.

ఈనేపధ్యంలో ‘అరవింద సమేత’ పరిస్థితి ఏమిటి ? అన్న కోణంలో త్రివిక్రమ్ ఆలోచనలలో ఉన్నట్లు సమాచారం. ఈమూవీకి సంబంధించి ఇంకా మూడు పాటలు చిత్రీకరించ వలసి ఉంది అని తెలుస్తోంది. ఆ మూడింటిలో రెండు రొమాంటిక్ సాంగ్స్. కనీసం ఈపాటల చిత్రీకరణకు 12 రోజుల సమయం పడుతుందని త్రివిక్రమ్ అంచనా. 

ఈనేపధ్యంలో మరో 10 రోజుల వరకు ‘అరవింద సమేత’ షూటింగ్ కు దూరంగా ఉంటే ఈమూవీ పాటల చిత్రీకరణ చాల కష్టం అవుతుంది. దీనికితోడు ఈసినిమాకు సంబంధించి జూనియర్ చెప్పవలసిన డబ్బింగ్ పనులు కూడ పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో అనుకున్న అక్టోబర్ 11వ తేదీకి విడుదల చేయడానికి కష్టం అన్న అంచనాలకు త్రివిక్రమ్ వచ్చినట్లు సమాచారం. 

ఈమూవీని అక్టోబర్ 19 విజయదశమి రోజున విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు త్రివిక్రమ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈవిషయాల పై మరింత క్లారిటీ కోసం త్రివిక్రమ్ నిర్మాత రాధాకృష్ణతో కలిసి మరో రెండురోజులలో జూనియర్ ను కలిసి అతడి దగ్గర నుంచి క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఈవార్తలే నిజం అయితే దసరా సెలవులు అన్నీ వృథా అయిపోతాయి కాబట్టి ఈమూవీ పై పెంచుకున్న కలక్షన్స్ అంచనాలలో చాల మార్పులు వచ్చే అవకాసం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: