తెలుగు ఇండస్ట్రీలో కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం భీనినేని శ్రీనివాస్ దర్శకత్వంలో సిల్లీఫెలోస్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ వర్క్ కూడా బాగా జరుగుతుంది. ఈ చిత్రంలో నరేష్ తో పాటు మరో కమెడియన్ సునీల్ కూడా నటిస్తున్నాడు. అయితే అల్లరి నరేష్ ప్రిన్స్ మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’లో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డె నటిస్తుంది. వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడే సమయంలో..‘మహర్షి’చిత్రానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లలో నటించానని..ముఖ్యంగా ‘గమ్యం’లాంటి చిత్రంలో గాలి శీను పాత్రలకు ఎంతో మంచి పేరు వచ్చిందని అన్నారు.
ఇక మహర్షిలో కూడా దాదాపు అలాంటి క్యారెక్టరే అని..ఇప్పటికే మహేష్ బాబు తో 45 రోజుల ట్రావెల్ చేశానని..మరో 100 రోజుల పాటు ఆయనతో జర్నీ చేయాల్సి ఉందని అన్నారు.
అక్టోబర్ లో షూటింగ్ జరగబోతుందని..అప్పుడు మళ్లీ మహేష్ తో కలిసి షూటింగ్ కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఇదండీ..ఇంతకు మించి ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడొద్దని మహేష్ బాబు నాకు వార్నింగ్ ఇచ్చారని నవ్వుతూ సమాధానం చెప్పారు అల్లరి నరేష్.