"మూవీ ఆర్టిష్ట్ అసోసియేషన్" లో నిధులు గోల్-మాల్ - మెగా..మెగా.. వ్యక్తులకూ ఆ పాపంలో వాటా? నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలు

తెలుగు సినిమా పరిశ్రమ - టాలీవుడ్ లో కలకలం రేపుతున్న ‘మా’ నిధుల దుర్వినియోగం మహా వివాదంపై తనదైన శైలిలో స్పందించారు వివాదాస్పద నటి శ్రీరెడ్డి.  మూవీ ఆర్టిష్ట్స్ అసోసియేషన్ (మా) రజతోత్సవ వేడుకల్లో భాగంగా, అధ్యక్షుడు శివాజీ రాజా, శ్రీకాంత్ తది తర సభ్యులు నిధులు దుర్వినియోగం చేశారంటూ 'మా' జనరల్ సెక్రటరీ నరేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే గతంలో పలుమార్లు అనేక వాదనలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు ఆ వ్యాఖ్యలను ఉదహరిస్తూ: "శ్రీకాంత్, శివాజీరాజా లకు గోచీ ఊడింది" అంటూ "చెప్పానా.. నేను చెప్తూనే ఉన్నా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ లో తెరవెనుక బాగోతాలు చాలానే నడుస్తు న్నాయని నెత్తీ నోరు కొట్టుకున్నా! నన్ను పట్టించుకుంటేనా! పబ్లిసిటీ స్టంట్ అన్నారు చూడండి ఇప్పుడు చూడండి ఏమైందో? " అంటూ, 'మా’ సభ్యులు శ్రీకాంత్, శివాజీరాజాల గోచీలు ఊడాయి అంటూ సంచలన వ్యాఖ్యలతో ‘మా’ వివాదంలోకి మరోసారి పునః ప్రవేసించింది నటి శ్రీరెడ్డి. 

ఈ నిధుల దుర్వినియోగంపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేయడంతో ఈ వివాదం టాలీవు డ్‌లో ప్రకంపనలు రేపుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ రచ్చరచ్చగా మారింది. 

ఈ సందర్భంలో ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న నటి  శ్రీరెడ్డికి, అసలే కోతి, అపై 'మా' అనే మందు తాగింది, మళ్ళా 'నిధుల గోల్మాల్' అనే నిప్పు తొక్కింది - ఇప్పుడు తైతక్కలాడుతుంది - కోతికి కొబ్బరికాయ దొరికినట్లు - తను తలదూర్చగల వివాదం దొరకటంతో వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది. మా సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడుతూ, ఫేస్ బుక్ ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడుతూ "కామెంట్స్‌ షేర్ చేసింది"  మా నేరగాళ్ల మయమని ఆమె చెప్పె
దానికి వాళ్లపై వాళ్ళే చేసు కున్న ఆరోపణలే అధారాలు. ఇంకే శ్రీరెడ్డికి విందు భోజనం మాత్రమేకాదు,  వీళ్ళను వదల కూడదు, అంటున్నారు చిత్ర పరిశ్రమలోని సాధారణ సభ్యులు. 


"అందులో నన్ను పబ్లిసిటీ స్టంట్ అన్న శివాజీ రాజాకి, శ్రీకాంత్‌కి గోచీ ఊడి, దరిద్రపు గతి పట్టింది. మోసపోయి నేనొస్తే, ఓదార్చాల్సింది పోయి, తను పబ్బం గడుపు కోటానికి ఒక బడా ఫ్యామిలీని కాపాడే ప్రయత్నం చేశారు. నాకు కోట్ల రూపాయలు ఇవ్వాలని శివాజీ రాజా అతని తొత్తులు ప్రయత్నిస్తే నేను కడుపు మండి తీసుకోలేదు. నా విషయం లో శివాజీ రాజా ప్రవర్తన బాధాకరం" 


"వీళ్లకు సెటిల్మెంట్‌లు చేసే గూండాలకు పెద్ద తేడా లేదు వీళ్ళు గుండాలే. ఆడ పిల్లల్ని కాల్చుకుతినే బ్రోకర్స్, తల్లిదండ్రుల్నే చూడ లేదు శివాజీ రాజా. ముసలివాళ్లకు ఆశ్రమం గురించి అమెరికా లో గంతులేశారట. తూ! మీ బతుకు!" 

మా డబ్బంతా పంచుకుని నంజుకు తింటున్నారు. అందరూ తోడు దొంగలే. దానికి బడా హీరో వాటా పెద్ద మొత్తం. దానికి సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది. అమెరికాలో ఏం జరిగిందో? ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి సిగ్గు ఉండాలి. ఆడపిల్లల ఏడుపు ఊరికే పోదు! మీరూ ఏద్వాలి! ఏడ్వండి! ఇంకా ఉంది ముసళ్ళ పండగ. "కీప్ ఇట్ నరేష్ గారూ!" అంటూ శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: