చరణ్ డ్రామాను బయటపెట్టిన ఉపాసన !

Seetha Sailaja
రామ్ చరణ్ ఉపాసనలు ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ లా ఉంటూ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ సెలెబ్రెటీ కపుల్ గా కొనసాగుతున్నారు. ఒకవైపు తన అపోలో సంస్థ వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తూనే రామ్ చరణ్ కు అతడి కెరియర్ కు సంబంధించి సలహాలు ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం చరణ్ పిఆర్ టీమ్ ను ఎప్పటికప్పుడు తన నియంత్రణలో పెట్టుకుంటూ చరణ్ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఇమేజ్ పెరగడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. 

ఇలాంటి పరిస్థుతులలో రామ్ చరణ్ తనపట్ల ప్రవర్తించిన డ్రామాను బయటపెట్టి తాను చరణ్ వల్ల మోసపోయాను అంటూ ఉపాసన పెట్టిన ట్విట్ మెగా అభిమానులను విపరీతంగా కనెక్ట్ అయింది. ఇక వివరాలలోకి వెళితే చరణ్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ కోసం యూరప్ లోని అజర్ బైజాన్ దేశంలో ఉన్న విషయం తెలిసిందే. 

ప్రకృతి అందాలకు పేరున్న ఈప్రాంతం చరణ్ కైరా అద్వానీ లపై ఒక రొమాంటిక్ సాంగ్ ను తీస్తున్నారు. ఈషూటింగ్ ను చూడటానికి చరణ్ తో పాటు కలిసి వెళ్ళిన ఉపాసనకు ఒక విషయంలో చరణ్ వల్ల మోసపోయిందట. ఈమూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత ఒకరోజు చరణ్ ఉపాసనను ఆ ప్రదేశంలోని ఒకప్రముఖ హోటల్ కు తీసుకువెళ్ళి డిన్నర్ పూర్తి అయిన తరువాత ఆమెకు నచ్చిన ఐస్ క్రీమ్ తెప్పించి ఆ ఐస్‌క్రీమ్‌పై చాక్లెట్‌ వేస్తూ చరణ్ సందడి చేయడమే కాకుండా ఉపాసనతో తాను కూడ తింటున్నట్లు నటించాడట.

అయితే ఆమరుసటి రోజు చరణ్ తన షూటింగ్ కు వెళ్ళే సమయంకన్నా ముందుగా లేచి తాను తిన్న ఐస్ క్రీమ్ లోని క్యాలరీలు కరిగే వరకు 45 నిముషాలు వ్యాయామం చేయించి మరీ షూటింగ్ కు వెళ్ళాడట చరణ్. ఈవిషయాలను మెగా అభిమానులకు ఉపాసన షేర్ చేస్తూ చరణ్ కు ‘ఉత్తమ నటుడు పురస్కారం’ ఇచ్చేయాలి అంటూ సరదాగా ఉపాసన చేసిన కామెంట్స్ మెగా అభిమానుల మధ్య సందడి చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: