పవన్ వ్యక్తిత్వం పై బురద జల్లిన ఆప్రముఖ ఛానల్ కథనం !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ కులమతాలకు తాను అతీతుడుని అంటూ అవకాశం వచ్చినప్పుడల్లా బహిరంగంగా చెపుతూ అన్నివర్గాల ప్రజల అభిమానాన్ని పొంది రాబోతున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి కావాలని తనవంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో పవన్ ఈమధ్య హైదరాబాద్ లో తనకాపు సామాజిక వర్గానికి చెందిన 150 ప్రముఖులతో నిర్వహించిన ఒకరహస్య సమావేశానికి సంబంధించిన ఒకషాకింగ్ న్యూస్ ను ఒకప్రముఖ ఛానల్ ఒకసంచలన కథనంగా ప్రసారం చేసిన నేపధ్యం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఒకరాజకీయ పార్టీని స్థాపించినప్పుడు ఆపార్టీ అధినేత తనసన్నిహితులను పిలిచి సమావేశాలు నిర్వహించడం పెద్దవిశేషం కాకపోయినా పవన్ నిర్వహించిన ఈసమావేశానికి ఆహ్వానించిన వారందరి దగ్గర ప్రతివ్యక్తి నుండి 10లక్షలు ఆసమావేశానికి వచ్చినందుకు ఎంట్రీ ఫీగా వసూలు చేసారని ఆప్రముఖ ఛానల్ తన షాకింగ్ కథనంలో వివరించింది. అంతేకాదు ఈసమావేశానికి కేవలం మన ఇరు రాష్ట్రాలలోని కాపు సామాజిక వర్గప్రముఖులు మాత్రమే కాకుండా సింగపూర్ మలేషియా దేశాలలో భారీస్థాయిలో వ్యాపారాలు చేస్తున్న ‘కాపు’ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామిక వేత్తలను కూడ ఆహ్వానించినట్లు ఆఛానల్ తన షాకింగ్ కథనంలో ప్రసారం చేసింది. 

వాస్తవానికి అమెరికా లాంటి  గొప్పదేశాలలో కూడ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ముందు ఆ దేశ అధ్యక్షుడుగా పోటీచేస్తున్న అభ్యర్ధులు ఇలా డిన్నర్ మీటింగ్స్ పెట్టి విరాళాలు వసూలు చేయడం సర్వసాధారణమే అయినా అలాంటి కల్చర్ ను మన తెలుగురాష్ట్రాల రాజకీయాలలో మొదటిగా ప్రవేశపెట్టింది పవన్ అనుకోవాలి. పవన్ నిర్వహించిన ఈసీక్రెట్ డిన్నర్ మీట్ కు వచ్చిన చాలమంది కాపుసామాజిక నేతలు తాము పవన్ వెంట ఉంటామని మాటఇవ్వడమే కాకుండా రాబోతున్న ఎన్నికల సమరానికి అవసరం అయిన అన్నిఆర్ధిక వనరులు అందిస్తామని వాగ్దానం చేసినట్లు ఆప్రముఖ ఛానెల్ తన కథనంలో పేర్కొంది. 

ప్రస్తుతం ఆఛానెల్ నిర్వహించిన ఈస్ట్రింగ్ ఆపరేషన్ కు సంబంధించిన సంచలన వార్తా కథనం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒకరాజకీయ పార్టీ ముఖ్యనేత ఎన్నికల సమరానికి ముందు రహస్య సమావేశాలు నిర్వహిస్తూ తనసన్నిహితుల సపోర్ట్ అడగడం మామూలే అయినా పూర్తిగా కాపు సామాజిక వర్గానికి చెందిన ధనవంతులతో పవన్ నిర్వహించిన ఈరహస్య సమావేశం బట్టి పవన్ రాజకీయ ఎత్తుగడలు కూడ పూర్తిగా కుల ప్రాతి పదిక పై జరుగుతూ అందరివాడిని అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ లోలోపల ‘కొందరి వాడు’ మాత్రమే అంటూ పవన్ వ్యక్తిత్వం పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ప్రసారం చేసిన ఈవార్తా కథనంలో అసలు నిజాలు ఏమిటి అన్నది రానున్న రోజులలో మాత్రమే తెలుస్తుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: