సమంతా! ఇప్పుడు చెప్పమ్మా! తన దాకా వస్తేనే కదా! తెలిసేది



సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ విడుదలైనప్పుడు సమంత ట్విట్టర్ వేదికగా ఆ పోస్టర్ పై అసహనం వ్యక్తం చేసింది. అందులో మహేష్ బాబు నడుస్తూ వెళ్తుంటే ఆయన పాదాలు అచ్చులను చేతితో స్పృజిస్తూ హీరోయిన్ కృతి సనాన్ ఉండే పోస్టర్ పై సమంత చేసిన కామెంట్స్ మహేష్ బాబు అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పించాయి.



అప్పట్లో సమంత పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు మహేష్ బాబు ఫ్యాన్స్. అయితే ఇప్పటికీ ఆ విషయాన్ని వారు మర్చిపోలేదని తాజా పరిణామాలు తెలియ జేస్తున్నాయి. సమంత భర్త అక్కినేని నాగచైతన్య నటించిన  శైలజా రెడ్డి అల్లుడు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమాకు చెందిన ఒక పాటను విడుదల చేసింది చిత్ర బృందం. 

ఈ పాటలో హీరోయిన్ అను ఇమ్మానుయేల్, చైతు పాదాల చెంత ముద్దు పెట్టుకొనే షాట్ ఒకటి ఉంది. అంతేకాదు తన మొహం మొత్తాన్ని మొత్తం చైతు పాదాల మీదపెట్టి తన్మయత్వం చెందే దృశ్యం ఒకటి ఈ పాటలో దర్శనమిచ్చింది. వీటిని తీసుకొని ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ సమంతని ప్రశ్నిస్తున్నారు.  ఆరోజు మహేష్ బాబు సినిమా పోస్టర్ చూసి అంతగా రియాక్ట్ అయిన సమంత ఈరోజు చైతూ అంతకన్నా ఎక్కువగా అను ఇమ్మానుయేల్ తో అలా ముద్దులు పాదాలపై పెట్టించుకోవడాన్ని ఏమనాలో? చెప్పాలంటూ సమంతని నిలదీస్తున్నారు. సమంత ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. మరి తనను తాను ఎలా సమర్ధించుకుంటుందో? మరి.నిరీక్షిద్ధాం! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: