సైమా అవార్డుల ఫంక్షన్ లో బయటపడని రాజకీయం !

Seetha Sailaja
ప్రతి ఏడాది విదేశాలలో నిర్వహించే ‘సైమా’ అవార్డుల ఫంక్షన్ ఎప్పుడు మీడియాకు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అయితే ఈసారి ఈ ఫంక్షన్ నిర్వాహకులే ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతలు కూడ అవ్వడంతో రాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ కు ఆసినిమా విడుదల కాకుండానే ఆటీమ్ కు అవార్డుల పంట పండించింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అందరూ ఊహించినట్లుగానే ‘సైమా’ అవార్డులలో ‘బాహుబలి 2’ టీమ్ ఎక్కువ అవార్డులను కొల్ల గొట్టింది. అయితే అత్యంత ఆశ్చర్యకరంగా ఇప్పటి వరకు ‘సైమా’ అవార్డులలో కనిపించని ఒక ప్రత్యేక విభాగాన్ని క్రియేట్ చేసి క్రిష్ బాలకృష్ణల ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కి కూడ అవార్డ్ లు కురిపించారు. 

బెస్ట్ యాక్టర్ గా ప్రభాస్ కు ‘సైమా’ అవార్డ్ వచ్చిన నేపధ్యంలో ప్రభాస్ తో సరి సమానంగా బాలకృష్ణకు కూడ స్థానం క్రియేట్ చేస్తూ బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) అని ఒక అవార్డును బాలయ్యకు అందిస్తున్నారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లో బాలయ్య నటనకు క్రిటిక్స్ ఈ అవార్డు అందివ్వాలని డిసైడ్ చేసారట. 

అదేవిధంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మూవీని డైరెక్ట్ చేసిన దర్శకుడు క్రిష్ కు బెస్ట్ డైరెక్టర్ రాజమౌళితో సమానంగా మళ్ళీ క్రిటిక్స్ విభాగంలోనే బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ఇవ్వడం మరింత ఆసక్తి కరంగా మారింది. దీనితో ‘సైమా’ అవార్డుల హడావిడిలో ‘బాహుబలి’ తో సమానంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడ హడావిడి చేస్తోంది. దీనితో ఎన్టీఆర్ బయోపిక్ విడుదల కాకుండానే బాలయ్యా క్రిష్ ల జంటకు వచ్చిన అవార్డులను చూసి వచ్చే ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ విడుదల అయిన తరువాత వచ్చే ఏడాది సైమా అవార్డులు అన్నీ ఎన్టీఆర్ బయోపిక్ కు మూకమ్మడిగా వచ్చినా ఆశ్చర్యం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: