అరవింద సమేత తప్పుడు ప్రమోషన్ పై జూనియర్ అభిమానుల తీవ్ర అసహనం !

Seetha Sailaja
‘అరవింద సమేత’ విషయంలో ఈమూవీ దర్శకుడు నిర్మాతలు అనుసరిస్తున్న వ్యూహాల పై జూనియర్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరికొద్ది గంటలలో ఈరోజు సాయంత్రం జరగబోతూ ఉన్నా ఆవిషయాలను పక్కకు పెట్టి జూనియర్ అభిమానులు తమ అసహనాన్ని ‘మేల్కోండి హారికా హాసినీ’ అంటూ ఒక ట్యాగ్ పెట్టి ఈమూవీ నిర్మాతలకు తమ ట్విట్స్ ద్వారా తమ అసహనాన్ని తెలియ చేస్తున్నారు. 

ఇలా జూనియర్ అభిమానులు అసహనానికి లోను అవ్వడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఈమూవీ విడుదలకు కేవలం 9 రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఈమూవీకి సంబంధించిన స్టిల్స్ ను అదేవిధంగా పోస్టర్స్ ను చాల తక్కువగా విడుదల చేస్తున్నారు అన్నది జూనియర్ అభిమానుల వాదన. 

వాస్తవానికి ఈసినిమా ప్రమోషన్ కు సంబంధించిన పనులను త్రివిక్రమ్ పి ఆర్ టీమ్ జూనియర్ పి ఆర్ టీమ్ వేరువేరుగా చూస్తున్న నేపధ్యంలో ఈ ఇద్దరి వ్యక్తుల పి ఆర్ టీమ్స్ మధ్య వచ్చిన ఇగో సమస్యలు ‘అరవింద సమేత’ ప్రమోషన్ ను దెబ్బ తీస్తున్నాయని జూనియర్ అభిమానుల వాదన. దీనికితోడు ఈరోజు గాంధీ జయంతి నేషనల్ హాలీడే అయిన సందర్భంగా ఈమూవీ ట్రైలర్ ఈరోజు ఉదయం విడుదల చేస్తే బాగుండేదనీ అయితే త్రివిక్రమ్ కు ఉన్న ముహూర్తాల నమ్మకం వల్ల ఈరోజు రాత్రి 8.10 లకు ఈమూవీ ట్రైలర్ ను ఫంక్షన్ లో విడుదల చేస్తున్న నేపధ్యంలో నేషనల్ హాలీడే సరదా అంతా నీరుకారి పోయిందని జూనియర్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. 

అయితే ఈవిషయాలు ఏమీ పట్టించుకోకుండా త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ ఫైనల్ ఎడిటింగ్ లో ఎటువంటి పొరపాట్లు లేకుండా చూస్తూ తన సర్వ శక్తులు ధార పోస్తున్నాడని టాక్. గతంలో తాను తీసే సినిమాల విషయంలో ఒక నియంతలా ప్రవర్తించే త్రివిక్రమ్ ఈసారి ‘అజ్ఞాతవాసి’ భయంతో తాను ఈసినిమాకు సంబంధించి తీసిన ప్రతి సీన్ విషయంలోనూ జూనియర్ దగ్గర నుండి తన సన్నిహితుల వరకు ఆసీన్స్ అన్నీ చూపెడుతూ వారందరి అభిప్రాయాలు తీసుకుంటూ ‘అజ్ఞాతవాసి’ ఫలితం మరొకసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని అన్ని జాగ్రత్తలు త్రివిక్రమ్ తీసుకుంటున్నాడు..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: