రాజమౌళిని కార్నర్ చేస్తున్న అమీర్ ఖాన్ అమితాబ్ వ్యూహాలు !

Seetha Sailaja
‘బాహుబలి’ మూవీతో ఇండియన్ టాప్ ఫిలిం సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళి ‘బాహుబలి 2’ రికార్డులను చూసి బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పైకి ప్రశంసలు కురిపించినా లో లోపల ‘బాహుబలి 2’ రికార్డుల పై ఈర్ష్య పడ్డారు అన్నది వాస్తవం. దీనితో ‘బాహుబలి’ లాంటి ఒకభారీ సినిమా తీసి ‘బాహుబలి 2’ తో క్రియేట్ చేయబడ్డ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 1700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ‘బాహుబలి 2’  చిత్రం రికార్డును అమీర్ ఖాన్ తన ‘దంగల్’ చిత్రంతో బ్రేక్ చేశాడు. చైనాలో దంగల్ చిత్రంకు అనూహ్యమైన వసూళ్లు వచ్చిన నేపథ్యంలో ‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్ అయ్యింది. కాని ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ నెలకొల్పిన రికార్డు మాత్రం అలాగే ఉంది. ‘బాహుబలి 2’ తర్వాత ఎన్నో స్టార్ హీరోల సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ముందుకు వచ్చాయి. 

కానీ  ఏ ఒక్కటి ‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేయలేక పోయాయి. ‘దంగల్’ కూడా ఓవరాల్ కలెక్షన్స్ పరంగా ఇండియాలో ‘బాహుబలి 2’ తర్వాత స్థానంలోనే ఉంది. ఇప్పుడు ‘బాహుబలి 2’ రికార్డును బద్దలు కొట్టేందుకు అమితాబ్ అమీర్ ఖాన్ లు కలిసి నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ ద్వారా  బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈమూవీ ప్రారంభం అయిన దగ్గర నుండి అంచనాలు పెరగడంతో ‘బాహుబలి 2’ రికార్డును ఈమూవీ బ్రేక్ చేస్తుంది అంటూ ప్రచారం మొదలైంది. 

దీనికితోడు ఈమూవీ ట్రైలర్ కు వచ్చిన స్పందన కూడ ఈ అంచనాలకు మరింత ఊపు ఇచ్చింది. దీనితో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రాన్ని నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈమూవీని త్వరలో రాబోతున్న దీపావళికి అత్యధిక ధియేటర్లలో విడుదల చేస్తూ ఈచిత్రం ప్రదర్శింపబడే మల్టీప్లెక్స్ ల్లో మొదటి వారం రోజులు 10శాతం టికెట్ల రేట్లు అధికంగా పెంచేందుకు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవడంతో ఈమూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే ‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్ కావడం ఖాయం అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. తన ‘బాహుబలి 2’ రికార్డులను తాను తీయబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ద్వారా బ్రేక్ చేయాలి అని కలలు కంటున్న రాజమౌళి ఊహించని షాక్ అమితాబ్ అమీర్ ఖాన్ లు ఇవ్వబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలు రాజమౌళికి ఊహించని షాక్ ఇస్తున్నాయి అని టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: