కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!

Edari Rama Krishna
గత కొంత కాలంగా బాలీవుడ్ లో వరుసగా టాప్ హీరోయిన్ల వివాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే అనిల్ కపూర్ కూతురు సోనం కపూర్,  నటి అనుష్క శర్మ వివాహం ప్రముఖ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో జరిగింది.  త్వరలో బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనె, ప్రియాంక చోప్రా కూడా వివాహం చేసుకోబోతున్నారు.  ఇక బాలీవుడ్ నటులు రణవీర్‌సింగ్, దీపిక పదుకొనెల వివాహం నవంబరు 14, 15 తేదీలలో జరగనుంది.  కాగా, వీరి వివాహానికి వెళ్లే గెస్టుల లిస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

వీరిద్దరికీ సన్నిహితులైన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఇటలీ చేరుకోగా, మరింతమంది నేడు బయలుదేరి వెళుతున్నారు.  అయితే, ఈ వివాహానికి అందాల భామ కత్రినా కైఫ్ కు మాత్రం ఆహ్వానం అందలేదట. గతంలో కత్రినా, రణవీర్ మధ్య నడిచిన అనుబంధం గురించి అందరికీ తెలిసిందే.  ఆ మద్య  'కాఫీ విత్ కరణ్'లో కత్రిన మాట్లాడుతూ.. దీపిక, రణవీర్‌ ల పెళ్లి కార్డు అందుకునేందుకు ఎదురు చూస్తున్నానని, ఈ వివాహ వేడుకలో భాగం కావాలని ఉందని చెప్పింది. 

అయితే కత్రినా ఎక్స్‌ బాయ్ ఫ్రెండ్ గా రణబీర్‌ కపూర్‌ ఉండటం, అతనికి కొంతకాలం దీపిక గర్ల్‌ ఫ్రెండ్‌ గా ఉండటం అందరికీ తెలిసిందే. దాంతొ కత్రీనా, దీపికల మధ్య అంతగా సఖ్యత లేనట్లు తెలుస్తోంది.  ఈ కారణంతోనే తన వివాహ వేడుకకు కత్రినను దూరంగా ఉంచినట్లు బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: