కౌశల్ ని నేను ఇప్పటి వరకు కలవలేదు : తనీష్

Edari Rama Krishna
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 1 ఎంతో రసవత్తరంగా సాగింది.  మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు.  బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా శివబాలాజీ నిలిచిన విషయం తెలిసిందే.  ఇక బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు.  ఈ సీజన్ లో పదిహేడు మంది ఇంటి సభ్యుల మద్య హోరా హోరీగా పోటీ కొనసాగింది.  కాకపోతే ఈసారి బిగ్ బాస్ 2 లో మాత్రం ఎన్నో కాంట్ర వర్సీలు మొదలయ్యాయి.  అంతే కాదు కౌశల్ గా ఎంట్రీ ఇచ్చిన ఇంటి సభ్యుడికి బయట ‘కౌశల్ ఆర్మీ’ ఏర్పడి తనతో పోటీలో ఉన్న వారిని..కౌశల్ ని ఇబ్బంది పెట్టిన వారిని టార్గెట్ చేసి ఒటింగ్ శాతం పడిపోయేలా చేస్తూ..బిగ్ బాస్ 2ని శాసింనట్లుగా ఆ మద్య వార్తలు వచ్చాయి. 

ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 2 ప్రశాంతంగా ముగిసిపోయింది.  అయితే బిగ్ బాస్ 2 లో మొదటి నుంచి కౌశల్ కి గట్టి పోటీ ఇస్తూ వచ్చాడు నటుడు తనీష్.  టాస్క్ ల విషయంలో ఇతర విషయాల్లో నువ్వ నేనా అన్న రేంజ్ లో వీరి మద్య పోటీ కొనసాగుతూ వచ్చింది.  ఇక ఫైనల్ కి చేరుకుంటున్న సమయంలో ఇద్దరూ ఫిజికల్ గా బాహాబాహీకి దిగడం అందరికీ షాక్ కి గురి చేసింది. ఆ తరువాత 3వ స్థానంలో తనీష్ బయటికి రావడం .. కౌశల్ విన్నర్ కావడం జరిగిపోయాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనీశ్ మాట్లాడుతూ..కౌశల్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కౌశల్ తనకు టచ్ లో లేడని..తాను ఎప్పుడూ కలవలేదని అన్నాడు.  అయితే ఇందుకు కారణం బిగ్ బాస్ లో తమ మద్య వచ్చిన గొడవలు కారణం కాదని..ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం వల్ల కలుసుకునే సందర్భం రాలేదని క్లారిటీ ఇచ్చాడు.  ఇక కౌశల్ ఆర్మీ గురించి తనీష్ స్పందిస్తూ "వాళ్లంతా ఎంతో ప్రేమతో ఆయనను గెలిపించారు .. అందుకు హ్యాట్సాఫ్' అని అన్నాడు.   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: