త్రివిక్రమ్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు.  ఆయన తీసిన ప్రతి చిత్రంలో ఏదో ఒక వైవిధ్యం ఉంటుంది.  పంచ్ డైలాగ్స్, సెంటిమెంట్, ఫైట్స్ ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రతలు తీసుకుంటారు.  ఇండస్ట్రీలో ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోలతో చిత్రాలు తీస్తారని ఒక టాక్ ఉంది. కానీ ఆయన ఏ హీరోతో చిత్రం తీసినా తన మార్క్ మాత్రం పోగొట్టుకోరు.  రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు.  ఈ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక చిత్రం తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుగు ఇండస్ట్రీలో దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి ఘనవిజయం అందుకున్నాడు.  ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రం పూర్తయిన తర్వాత స్టార్ దర్శకులు కొరటాల తో ఓ చిత్రం తీయబోతున్నట్లు..అందుకు మంచి కథ సిద్దం చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఆ కథకు పూర్తి స్క్రిప్ట్ రూపాన్ని ఇచ్చే పనిలో బిజీగా వున్నారు. జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. తాజాగా త్రివిక్రమ్ కూడా చిరుని కలిసినట్టు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు  చిరంజీవికి గల క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని.. అభిమానులు ఆశించే అన్ని అంశాలను తన చిత్రంలో ఉండే విధంగా త్రివిక్రమ్ ఒక కథను సిద్ధం చేశాడట.

ఇటీవల చిరంజీవిని కలిసి ఆ కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో వెంటనే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.  ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. అంతా ఓకే అయితే అల్లు అర్జున్ చిత్రం పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ .. చిరూ ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెడతాడట. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: