ఎన్టీఆర్ వ్యక్తిత్వం పైన ప్రియ మణి సంచలన వ్యాఖ్యలు...!

Prathap Kaluva

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రియ మణి ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా చలామణి అయ్యింది . అయితే పెళ్లి చేసుకున్న తరువాత సినిమా ల్లో అవకాశాలు రావడం లేదు. అయితే దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం సంచలనం రేపింది. ముఖ్యమంగా బాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. చాలా మంది నటీమణులు మీటూ ఉద్యమంలో పాల్గొని తమకు ఎదురైన లైంగిక వేధింపులని బహిర్గతం చేశారు. తాజాగా ప్రియమణి మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 


దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం సంచలనం రేపింది. ముఖ్యమంగా బాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. చాలా మంది నటీమణులు మీటూ ఉద్యమంలో పాల్గొని తమకు ఎదురైన లైంగిక వేధింపులని బహిర్గతం చేశారు. తాజాగా ప్రియమణి మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. భయపడకుండా ప్రతి ఒక్కరూ మాట్లాడగలిగితే ఇలాంటి విషయాల గురించి అందరికి ఓ అవగాహన ఏర్పడుతుంది అని ప్రియమణి తెలిపింది. కొందరు ఈ ఉద్యమాన్ని పబ్లిసిటి కోసం ఉపయోగించుకుంటున్నారని ప్రియమణి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఆశయం కోసం జరుగుతున్న ఉద్యమంలో ఇలా పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తూ కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రియమణి వ్యాఖ్యానించింది. 


ఇదే ఇంటర్వ్యూలో ప్రియమణి తనకు నచ్చిన నటుడి గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించింది. టాలీవుడ్ లో చాలా మంది గొప్ప నటులు ఉన్నారు. ఎవరికి వారు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నారు. తాను మాత్రం వ్యక్తిగతంగా జూ. ఎన్టీఆర్ ని ఇష్టపడతానని తెలిపింది. తారక్ మనసున్న ఉత్తమ నటుడు అంటూ ప్రశంసల్లో ముంచెత్తింది. ప్రియమణి, ఎన్టీఆర్ జంటగా యమదొంగ చిత్రంలో నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: