రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన ‘2.0’!
సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘2.0’ చిత్రం రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. విడుదలైన మొదటిరోజే విజువల్ వండర్గా క్రియేట్ చేసిన ఈ చిత్రం…ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 100 కోట్లు సాధించింది. ఒక్క హిందీ వర్షనే దాదాపు 25 కోట్లు సాధించి సినీ లెక్కల దుమ్ముదులిపింది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లు రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు రాబట్టింది. బాహుబలి తర్వా తర్వాత 2.0 వరుసరోజుల్లో వందకోట్లను సాధిస్తోంది. వీక్డేస్లోనూ మోస్తరు కలెక్షన్లతో ముందుకు సాగుతుంది. ఇటీవల విడుదలైన 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' దారుణమైన ప్లాప్ అవ్వగా... ఆవెంటనే రిలీజైన 2.0 చిత్రం బాక్సాఫీస్ గ్రాఫ్ను ఒక్కసారిగా పైకి లేపింది.
హిందీ వర్షన్లో కూడా ఈ చిత్రం రూ.120 వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తొలివారంలో ఈ సినిమా నైజాంలో రూ.17 కోట్ల షేర్ను రాబట్టింది. ఒక అనువాద చిత్రం ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఈ మార్కెట్లో దాదాపు రూ. 370 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ విజువల్ వండర్ ఇంటర్నేషనల్ మార్కెట్లో దాదాపు రూ. 130 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అంతే కాదు కేరళలో 2.0 ఇప్పటికే సర్కార్ మూవీ లైఫ్ టైమ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది.
ఇక్కడ ఈ చిత్రం దాదాపు రూ. 15 కోట్లు వసూలు చేయడం ద్వారా మలయాళం ఇండస్ట్రీలో ఇతర భాషా చిత్రాల పేరు మీద ఉన్న హయ్యెస్ట్ గ్రాస్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు వరుస సెలవులు కావడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని సమాచారం. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే లాంగ్రన్లో రూ. 1000 కోట్ల కలెక్షన్లు సాధించి బాహుబలి తర్వాత స్థానం సంపాదిస్తుందేమో చూడాలి.
వెయ్యి కోట్లు వసూలు చేస్తే పెట్టిన పెట్టుబడి రెట్టింపు వేగంతో నిర్మాతల, సినిమా బయ్యర్ల జేబుల్లో చేరినట్టే. 2.0 చిత్రం వసూళ్ల ప్రభంజనం చూస్తుంటే 2018 సంవత్సరం ఇండియన్ ఫిలమ్ హిస్టరీలో హయ్యెస్ట్ కలెక్షన్ రికార్డుతో ముగిసేలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే..డిసెంబర్ 7న ఒకేరోజు నాలుగు చిత్రాలు రిలీజ్కి రెడీగా ఉన్నందున 2.0 చిత్రం ఇంతే రేంజ్లో కలెక్షన్లు సాధిస్తుందా లేదా అనేది చూడాలి.