పెళ్ళిళ్ళకు రాజకీయాలకు సంబంధమా పవన్ కళ్యాణ్ ప్రశ్నలు !

Seetha Sailaja
గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ వ్యవహారం పై తిరిగి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శల పై పవన్ ఘాటైన రివర్స్ ప్రశ్నలు వేసాడు. తెలుగు రాష్ట్రాలు విడిపోవడానికి తన మూడు పెళ్ళిళ్ళు కారణమా ? తెలుగు రాష్ట్రాలలో అవినీతి పెరిగి పోవడానికి తన మూడు పెళ్ళిళ్ళు కారణమా? రాజకీయ నాయకులు కేసులలో ఇరుక్కుని జైలుకు వెళ్ళడానికి తిరిగి తన మూడు పెళ్ళిళ్ళు కారణమా అంటూ పవన్ వేసిన ప్రశ్నలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.

అంతేకాదు తాను ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం లేదని రాజకీయ పార్టీలు నాయకుల అవినీతి గురించి మాట్లాడితే దానికి సమాధానం ఇవ్వలేక తన పెళ్ళిళ్ళను టార్గెట్ చేస్తూ ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు అంటూ మాటల ఎదురు దాడి మొదలు పెట్టాడు పవన్. తన పెళ్ళిళ్ళ పై చాలామంది చేస్తున్న కామెంట్స్ కు ఈసారి మౌనం వహించకుండా ఎదురు దాడి చేయడంతో పవన్ తన వ్యూహాలను మారుస్తున్నాడు అనుకోవాలి. 

ఇదే సందర్భంలో పవన్ మాట్లాడుతూ చాలామంది నాయకులకు దోపిడీ కల్చర్ ఉంటే తనకు చెగు వేరా ఆదర్శం అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. పవన్ వేస్తున్న రివర్స్ పంచ్ లను చూస్తుంటే ఇక రానున్నరోజులలో పవన్ కళ్యాణ్ మౌనం వీడి తన పై వస్తున్న ప్రతి విమర్శకు ఘాటైన సమాధానాలు ఇచ్చే ఆలోచనలు చేస్తున్న తీరు కనిపిస్తోంది. 

అంతేకాదు ఇప్పటి వరకు మౌనంతో కాలం వెళ్ళబుచ్చిన పవన్ ఇక నుంచి తన మౌనం వీడటమే కాకుండా అందరి రాజకీయ నాయకులలాగే విమర్శలకు ఘాటైన ప్రతి విమర్శలు చేస్తూ తరుచూ ఇలా మీడియా ముందుకు రాబోతున్నాడు అన్న సంకేతాలు వస్తున్నాయి. నేటితో తెలంగాణ ఎన్నికల హడావిడి పూర్తి కావడంతో ఇక అందరి దృష్టి వచ్చే సంవత్సరం రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పై ఉంటుంది. ఇలాంటి పరిస్థుతులలో ఇప్పటికే తన ‘జనసేన’ ను జనం మధ్యకు తీసుకు వెళ్ళడంలో  చాల ఆలస్యం చేస్తున్నాడు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ఇక నుంచి పవన్ నుండి కూడ మాటల తూటాలు ఎక్కువగా వచ్చే ఆస్కారం కనిపిస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: