టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు 'జీఎస్టీ' షాక్ తగిలింది. జిఎస్టీ పన్ను బకాయిలు చెల్లించాలంటూ ఇచ్చిన నోటీస్ లకు స్పందించనందున మహేష్బాబుకు చెందిన పలు బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రకటనలు, బ్రాండ్ ప్రమోషన్, బ్రాండ్ అంబాసిడర్ గా అందించిన సేవలకుగాను మహేష్ బాబుకు లభించిన ఆదాయంపై పన్ను చెల్లించ లేదని జీఎస్టీ ఆరోపించింది. వెంటనే పన్ను బకాయిలు చెల్లించాలని కోరుతూ సంబంధిత శాకహలు నోటీసులు జారీచేసింది.
గత తొమ్మిదేళ్లుగా పన్ను ఎగవేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు ఆయన బ్యాంకు ఖాతాలను జప్తు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ ఒక ప్రకటన జారీ చేసింది. 2007-08 సంవత్పరానికి గాను సర్వీస్ టాక్స్ చెల్లించలేదని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకుంది.
ఈ మేరకు హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ ఒక ప్రకటన జారీ చేసింది. 2007-08 సంవత్పరానికి గాను సర్వీస్ టాక్స్ చెల్లించలేదని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకుంది. ఈ కాలానికి మొత్తం ₹18.5 లక్షలు బకాయిలు ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబుకు చెందిన యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసింది. పన్ను, జరిమానా, వడ్డీతో సహా మొత్తం ₹73.5 లక్షలు వెంటనే చెల్లించాలని ఆదేశించింది.