ప్రముఖ టీవినటి కన్నుమూత!

Edari Rama Krishna
టెలివిజన్ రంగంలతో నికితగా పాపులారిటీ సంపాదించిన ఒడిశా టెలివిజన్ నటి లక్ష్మీప్రియ బెహరా ప్రమాదవశాత్తు కన్నుమూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మహానది విహార్ ప్రాంతంలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లిన నికిత ప్రమాదవశాత్తు టెర్రస్ పైనుంచి కిందపడింది. ఆ మద్యనే మహానది విహార్ ప్రాంతంలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లింది లక్ష్మీప్రియ.  టెర్రాస్ పై నుంచి పడటంతో ఆమెకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. 

ట్రెర్రాస్ పై నుంచి పడటం గమనించిన ఆమె కుంటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  అనంతరం కటక్‌లోని ఎస్‌సీబీ ఆసుపత్రికి తరలించారు. అక్కడామె పరిస్థితి మరింత విషమించడంతో మరోమారు ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

తీవ్ర గాయాల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు నికిత తల్లిదండ్రులు, భర్త తెలిపారు. అయితే, టెర్రస్ పైనుంచి ఎలా కిందపడిందన్న విషయాలు తెలియరాలేదు. ఆమెకు 2016లో గోపాల్‌పూర్‌కు చెందిన లిపన్ సాహుతో కటక్‌లో వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమార్తె ఉంది. ‘చోరీ చోరీ మానా చోరీ’, ‘మా రా పనతకాని’, ‘స్మైల్ ప్లీజ్’ వంటి సినిమాల్లోనూ నికిత నటించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: