కన్నడ హీరో యష్ నటించిన 'కేజీఎఫ్' సూపర్ హిట్ అయ్యింది. కన్నడ హీరో అయిన యష్ తెలుగులో బాగా ప్రమోట్ చేశారు..తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారని తెగ సంతోష పడ్డారు. కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన 'కేజీఎఫ్' భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ ఈ సినిమా జోరు కొనసాగుతూ ఉంది.
తెలుగు లో మంచి కలెక్షన్లు రాబట్టిన డబ్బింగ్ సినిమాగా 'కేజీఎఫ్' గత ఏడాది చివరల్లో నిలిచింది. త్వరలో సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే నిర్మాత విజయ్ కిరంగన్ దుర్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేశాడు. 2వ భాగానికి సంబంధించి సంజయ్ దత్ .. రమ్యకృష్ణల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాహుబలి సీరిస్ తర్వాత రమ్యకృష్ణ జాతీయ స్థాయిలో బాగా బిజీ అయ్యింది. దాంతో బాలీవుడ్ లో కూడా పలు సినీ ఛాన్సులు వస్తున్నాయి.
భారత రాష్ట్రపతి రిమికా సేన్ పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తుందనీ, మరో పవర్ ఫుల్ పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తాడని అంటున్నారు. మొదటి భాగంలో నటించిన రవిశంకర్ అదే పాత్రలో కనిపించబోతున్నారట. కొన్ని క్యారెక్టర్లు ఈ సినిమాలో తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఈసారి మరింత పవర్ఫుల్ గా ఆయన పాత్రను తీర్చిదిద్దుతున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు హైలెట్ గా చూపించబోతున్నారట.