విజువల్లీ ఛాలెంజెడ్ పాత్రలో స్వీటీ అనుష్క మరో రాం చరణ్ కావాలనా?


అనుష్క అంటేనే తన ఎత్తును మించిన హుందాతనానికి నటనకు సౌందర్యానికి మారుపేరు. గత  సంక్రాంతి తరువాత భాగమతి సినిమాలో హిట్ ఇచ్చిన హీరోయిన్ అనుష్క. ఆ తరువాత మళ్లీ సినిమా చేయలేదు. ఇప్పుడు మళ్లీ మరో హర్రర్ థ్రిల్లర్ నే సెలెక్ట్ చేసుకుంది. అనుష్క సరసన తమిళ హీరో మాధవన్ నటిస్తారు. ఈ ఇద్దరి తో పాటు అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు ఇప్పటికి ఎంపికయిన తారాగణం. మైఖెల్ మ్యాడ్సన్ అనే హాలీవుడ్ నటుడు కూడా ఉన్నాడు. భాగమతి దిగ్విజయం తరవాత సుమారుగా ఏడాదిన్నరగా సినిమాలకు దూరంగా ఉన్న స్వీటీ ఇన్నాళ్లకు మళ్లీ నటించటానికి సిద్ధమైంది.

హాలీవుడ్ నటుడు నిర్మాత దర్శకుడు మైఖేల్ సోరెన్ మాడ్సన్ 


చాలారోజుల త‌ర్వాత ఈ రీ-ఎంట్రీ సినిమాపై క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. కాకపోతే చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది ఈ ముద్దుగుమ్మ. కోన వెంకట్ నిర్మాణంలో మార్చి నెలలో అమెరికాలో ప్రారంభయ్యే ఈ సినిమాను అన్ని సౌత్-లాంగ్వేజెస్ లో ఒకేసారి షూట్ చేస్తారు. ఏ స్టార్ హీరో తోనో, లేదంటే ఏ అగ్ర ద‌ర్శ‌కుడితోనో సినిమా చేస్తుంది అనుకుంటే కోన‌ వెంక‌ట్ సినిమాలోన‌టించ‌డానికి ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ విష‌యాన్ని కోన స్వ‌యంగా ట్వీట్ చేసాడు. మ‌రోవైపు అనుష్క కూడా బ‌రువు త‌గ్గే ప‌నిలో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పటికే తగ్గింది కూడా.


ఈ చిత్రంలో అనుష్క దృష్టి లోపం ఉన్న మహిళ గా ఛాలెంజింగ్ రోల్ లో నటించనుంది.  ఈ పాత్ర కోసం తనను తాను చాలా మార్చుకుంటుంది అనుష్క. 11 ఏళ్ల కింద మాధవన్‌తో ‘రెండు’ అనే సినిమా చేసింది అనుష్క‌. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు ఆయ‌న‌తో సినిమా చేయ‌బోతుంది జేజ‌మ్మ‌. "స‌వ్య‌సాచి"తో తెలుగులో అడుగు పెట్టిన మాధ‌వ‌న్, ఇప్పుడు మ‌రో సినిమా చేస్తున్నాడు. అప్పుడు "రెండు" సినిమాతో ఫ్లాప్- ఇచ్చిన ఈ జోడీ ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. మరి ఈ విజువల్లీ ఛాలెంజెడ్ పాత్ర లో అనుష్క ఎలా నటించ బోతుందో చూడాలి.


హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్, గోపి సుందర్, షనీల్ డియో, గోపి మోహన్, నీరజ కోనలు ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు. 2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల టార్గెట్ గా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర ప్రెస్-నోట్ కూడా విడుదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: