మహర్షిని ప్రభావితం చేసిన సంక్రాంతి సినిమాల పరాజయం !

Seetha Sailaja
ఈ సంవత్సరం సంక్రాంతి రేసుకు వచ్చిన భారీ సినిమాలు ‘వినయ విధేయ రామ’ ‘కథానాయకుడు’ ఘోర పరాజయం చెందడంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి. అయితే ఈషాక్ ప్రిన్స్ మహేష్ కు కూడ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో అవసరం అనుకుంటే తన లేటెస్ట్ మూవీ మహర్షి రీ షూట్ చేద్దాము అని మహేష్ అంటున్నట్లు సమాచారం. 

వాస్తవానికి ఈసినిమా షూటింగ్ 70 శాతం వరకు పూర్తి అయిన తరువాత ఈసినిమాకు సంబంధించిన రషస్ చూసిన తరువాత మహేష్ కు కొంత అయోమయం కలిగినట్లు సమాచారం. దీనికి కారణం ఈమూవీ నెరేషన్ చాల స్లోగా ఉన్నట్లు మహేష్ కు అభిప్రాయం కలిగినట్లు టాక్. 

దీనికితోడు ఈమధ్య చాల సినిమాలు ఎంత భారీ బడ్జెట్ తో తీసినా స్లో నెరేషన్ తో ఉన్నప్పుడు ప్రేక్షకులు తిరస్కరిస్తున్న నేపధ్యంలో ‘మహర్షి’ సినిమాకు ఈ స్లో నెరేషన్ శాపంగా మారుతుందని మహేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈమూవీ రిలీజ్ డేట్ ను పోస్ట్ ఫోన్ చేయమని మహేష్ ఈమూవీ నిర్మాతల పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. 

ఇప్పటికే ఈసినిమాకు ఓవర్ బడ్జెట్ అయిపోయింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈమూవీ స్లో నెరేషన్ కు సంబంధించిన వార్తలు ఈమూవీ మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు అన్ని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ‘మహర్షి’ ముందుగా అనుకున్నట్లుగా ఏప్రియల్ 5న కాకుండా మరో రెండు మూడు వారాలు రిలీజ్ వాయిదా పడినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. దీనికితోడు ‘మహర్షి’ రిలీజ్ డేట్ కు నాగచైతన్య సమంతల ‘మజిలీ’ తన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడంతో ‘మహర్షి’ పై వస్తున్న వార్తలు నిజమే అన్న సందేహాలు కలుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: