షాకింగ్ యాత్ర టికెట్ ను 4.37 లక్షలకు కొని సంచలనం సృష్టించిన వీరాభిమాని !

Seetha Sailaja
ఈవారం విడుదల కాబోతున్న యాత్ర మూవీని చాల పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ పాత్రను పోషిస్తున్న మమ్ముట్టి ఈమూవీ డైరెక్టర్ మహి వి రాఘవన్ తో కలిసి పత్రికలకు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈమూవీ పై అంచనాలు పెంచి ఓపెనింగ్ కలక్షన్స్ బాగా వచ్చేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ ఊహించని పరాజయం పొందిన నేపధ్యంలో బయోపిక్ లపై సాధారణ ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిన పరిస్థుతులలో యాత్ర ఒక డిఫరెంట్ మూవీ అని అభిప్రాయం కలిగేలా ప్రమోట్ చేస్తున్నారు. 

రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో కీలక ఘట్టం అయిన పాదయాత్ర నేపధ్యంలో నిర్మింపబడ్డ ఈమూవీ విజయం అంతర్లీనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఎంతో దోహద పడుతుంది. దీనితో క్వాలిటీ విషయం ఎక్కడా రాజీ పడకుండా ముమ్ముట్టి స్వయంగా ఈమూవీకి డబ్బింగ్ చెప్పుకోవడం విశేషంగా మారింది. ఈమూవీలోని ఎమోషనల్ సన్నివేశంలో మమ్ముట్టి నటన హృదయాన్ని హత్తుకునేలా ఉండబోతున్నట్లు టాక్. 

వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి కూడా ఈ చిత్రంలో చూపించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఓవర్సీస్ లో విడుదల కాబోతున్న ‘యాత్ర’ మూవీకి సంబంధించి మొదటిరోజు మొదటి షో మొదటి టిక్కెట్ ను ఒక ఎన్ఆర్ఐ ఈమూవీ టిక్కెట్లకు సంబంధించిన వేలం పాటలో  6,116 డాలర్లకు కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. మన ఇండియన్ కరెన్సీ విలువలో చూసుకుంటే ఆ వీరాభిమాని ‘యాత్ర’ మొదటి టిక్కెట్ కోసం 4.37  లక్షలు ఖర్చు పెట్టాడు అనుకోవాలి. 

ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ సినిమాకు కూడ విదేశాలలో ఉన్న నందమూరి అభిమానులు ఈస్థాయిలో భారీ మొత్తానికి టిక్కెట్లు కొనలేదు. ఈమూవీ నిర్మాతలు తొలి టికెట్ డబ్బుని వైఎస్ఆర్ చారిటి ఫౌండేషన్‌ కు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫిబ్రవరి నెలలో ‘యాత్ర’ ‘మహానాయకుడు’ సినిమాల మధ్య వార్ జరుగుతున్న నేపధ్యంలో ఈ రెండు బయోపిక్ సినిమాల మధ్య ఎవరు పై చేయి సాదిస్తారు అన్న విషయం కీలకంగా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: