‘యాత్ర’ను తెగమెచ్చుకున్న రాంగోపాల్ వర్మ!

Edari Rama Krishna

తెలుగు ఇండస్ట్రీలో సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన బయోపిక్ చిత్రాలు వస్తున్ననేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చిత్రానికి మహి వి రాఘవ దర్శకులు.  వైఎస్సార్ పాత్రలో మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు.  ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో హిట్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్లు రాబడుతుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


  'యాత్ర' సినిమా విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విమర్శకుల నుంచి సైతం మంచి రేటింగ్స్ వచ్చాయి.  'యాత్ర' చిత్రం చూసిన తర్వాత వైఎస్ఆర్ అభిమానులు నుంచి తనకు వేలాది ఫోన్స్ వస్తున్నాయని ఈ చిత్రాన్ని ఆదరించిన తెలుగు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు అంటూ దర్శకులు అన్నారు.  తాజాగా సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ వర్మ వీక్షించారు.


అనంతరం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ చిత్రం తీసిన విధానం, దర్శకుడు మహి వి రాఘవ్ పని తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. 'యాత్ర' ఒక అద్భుతమైన చిత్రం. వైఎస్ఆర్ పాత్రను చూపించిన విధానం చాలా బావుంది. ఆయన ఒక గొప్ప నాయకుడు. వైఎస్ఆర్‌ను సజీవంగా తెరపైకి తీసుకొచ్చిన మహి వి రాఘవ్‌ను అభినందించకుండా ఉండలేక పోతున్నాను. మమ్ముట్టి.. వైఎస్ పాత్రలో జీవించారు' అంటూ వర్మ ట్వీట్ చేశారు. 

Yatra is an awesome film ..A truly great insight into YSR,a truly great leader ..Kudos to @MahiVraghav who made him come alive and kudos to @mammukka for immortalising him forever 🙏🙏🙏

— Ram Gopal Varma (@RGVzoomin) February 12, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: